Ashwini Vaishnaw: సాంకేతిక శక్తికేంద్రంగా భారత్ ఎదుగుతోంది.. అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు

జపాన్‌లో జీ7 డిజిటల్, టెక్ మంత్రులతో జరిగిన సమావేశం పాల్గొన్న అనతంరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ భారత్‌కు తిరిగివచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Ashwini Vaishnaw: సాంకేతిక శక్తికేంద్రంగా భారత్ ఎదుగుతోంది.. అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు
Ashwini Vaishnaw
Follow us

|

Updated on: May 04, 2023 | 10:09 PM

జపాన్‌లో జీ7 డిజిటల్, టెక్ మంత్రులతో జరిగిన సమావేశంలో పాల్గొన్న అనతంరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ భారత్‌కు తిరిగివచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ సాంకేతిక శక్తికేంద్రంగా, విశ్వసనీయత భాగస్వామిగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ఇదంతా డిజిటల్ ఇండియా, మోక్ ఇన్ ఇండియా లాంటి వాటిని ప్రధాని మోదీ దూరదృష్టి కార్యక్రమాల వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. టెక్నాలజీ అభివృద్ధిదారులుగా భారత్ వృద్ధి ప్రయాణం నుంచి నేర్చుకునేందుకు నేడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి చూపుతున్నారని వివరించారు.

ఇవి కూడా చదవండి

G7 అనేది కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, UK మరియు USAలతో కూడిన అంతర్ ప్రభుత్వ ఫోరమ్. అయితే ఈ సమావేశంలో పాల్గొనాలని భారత్‌కు ఆహ్వానం అందింది. ఏప్పిల్ 29, 30 న జరిగిన ఈ సమావేశంలో అశ్వినీ వైష్ణవ్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. భారత డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌‌కు సంబంధించిన విషయాలను ఆయన వివరించారు. భారత్‌లో వినియోగించే ఆధార్ కార్డ్, యూపీఐ, కొవిన్ పొర్టల్ లాంటి వాటి ఉపయోగాలను ప్రదర్శించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఇతర దేశాలకు చెందిన ప్రతినిధులు డిజిటల్ ఇండియా పురోగతిపై ప్రశంసించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..