AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: హోంశాఖ సమీక్షలో సీఎం జగన్‌ కీలక ప్రకటన.. ‘వారి వేధింపులకు అడ్డుకట్ట’ వేయాలంటూ..

‘జీవో నెం1పై ప్రత్యేక చర్యలు చేపట్టండి..సోషల్ మీడియా వేధింపులకు తావులేకుండా ప్రత్యేక దృష్టి సారించండి’ అంటూ కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. డ్రగ్స్ రవాణా నిర్మూలించి.. పెడలర్స్ పట్ల కఠినంగా వ్యవహారించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్. హోంశాఖపై..

Andhra Pradesh: హోంశాఖ సమీక్షలో సీఎం జగన్‌ కీలక ప్రకటన.. ‘వారి వేధింపులకు అడ్డుకట్ట’ వేయాలంటూ..
Andhra Pradesh CM YS Jagan
శివలీల గోపి తుల్వా
|

Updated on: May 04, 2023 | 9:50 PM

Share

‘జీవో నెం1పై ప్రత్యేక చర్యలు చేపట్టండి..సోషల్ మీడియా వేధింపులకు తావులేకుండా ప్రత్యేక దృష్టి సారించండి’ అంటూ కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. డ్రగ్స్ రవాణా నిర్మూలించి.. పెడలర్స్ పట్ల కఠినంగా వ్యవహారించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్. హోంశాఖపై రివ్యూలో ఏపీ సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. జీవో నెంబ‌ర్‌ 1పై ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి.. కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం జ‌గ‌న్. జీవో నెంబ‌ర్ 1ను స‌మ‌ర్ధవంతంగా అమ‌లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రోడ్లపై మీటింగ్‌ల వల్ల ప్రజలు చనిపోయే పరిస్థితులు ఉండొద్దన్నారు. సభలో తక్కిసలాటపై సీఎం మాట్లాడారు. సభకు హాజరైన తక్కువమందిని ఎక్కువగా చూపించే ప్రయత్నంలో అమాయకుల ప్రాణాలు పోతున్నాయని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో కందుకూరు,గుంటూరు మీటింగ్స్‌లో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ప్రస్తావించారు సీఎం జగన్‌.

మరోవైపు హోంశాఖ సమీక్షలో రాష్ట్రంలో సోషల్‌ మీడియా వేధింపులకు అడ్డుకట్ట పడాలని అధికారులను ఆదేశించారు సీఎం. సోషల్ మీడియా వేధింపులపై ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే సచివాలయాల్లో ఉన్న మహిళా పోలీసులకు కచ్చితమైన ప్రోటోకాల్‌ ఉండాలన్నారు. మహిళా పోలీసులు ప్రస్తుతం నిర్వహిస్తున్న విధులు, చేపడుతున్న బాధ్యతలపై సమగ్ర సమీక్ష చేసి మార్పులు, చేర్పులపై ఆలోచన చేయాలన్నారు. అలాగే దిశ యాప్‌ పై మరోసారి డ్రైవ్‌ నిర్వహించాలన్నారు. ప్రతి ఇంట్లో కూడా ఈ యాప్‌ను డౌన్లోడ్‌ చేసుకున్నారా? లేదా? అన్నదానిపై అధికారులు మరోసారి పరిశీలన చేయాలని ఆదేశించారు. దిశ యాప్‌ వల్ల కలిగే ప్రయోజనాలను ప్రతి ఇంటికి క్లుప్తంగా వివరించాలని తెలిపారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక దిశ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్.

అలాగే ఆంధ్రప్రదేశ్‌ను డ్రగ్ రహిత రాష్ట్రం తీర్చిదిద్దాలన్నారు సీఎం జగన్. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, మత్తుపదార్థాలను పూర్తిగా నిర్మూలించాలన్నారు. వాటి రవాణా, పంపిణీ, వినియోగంపై పూర్తిస్థాయిలో ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. డ్రగ్‌ పెడలర్స్‌ పట్ల కఠినంగా వ్యవహరించడమే కాకుండా.. కఠినమైన శిక్షలు విధించాలని అధికారులకు హోంశాఖ సమీక్షలో సూచించారు సీఎం జగన్.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ముగ్గురు సీఎంలతో నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఒకప్పుడు..
ముగ్గురు సీఎంలతో నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఒకప్పుడు..
ఫిబ్రవరి 29న మొదలైన ‘గమ్యం’ మ్యాజిక్‌కు 18 ఏళ్లు
ఫిబ్రవరి 29న మొదలైన ‘గమ్యం’ మ్యాజిక్‌కు 18 ఏళ్లు
ఆశీర్వాదం కుడి చేతితోనే ఎందుకు ఇవ్వాలి..? ఈ విషయాలు తెలిస్తే..
ఆశీర్వాదం కుడి చేతితోనే ఎందుకు ఇవ్వాలి..? ఈ విషయాలు తెలిస్తే..
వేసవి కాలంలో చెరుకురసం తాగడం మంచిదేనా?
వేసవి కాలంలో చెరుకురసం తాగడం మంచిదేనా?
తమిళపార్టీల తొక్కిసలాట.. పిచ్చెక్కిస్తున్న దళపతుల కొట్లాట!
తమిళపార్టీల తొక్కిసలాట.. పిచ్చెక్కిస్తున్న దళపతుల కొట్లాట!
అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..
అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?