AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమిత్ షా విమానంలో సాంకేతిక సమస్య.. అప్రమత్తమైన అధికారులు.. !

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న విమానంలో ముంబైలో సాంకేతిక లోపం ఏర్పడింది. రెండు రోజుల ముంబై పర్యటన తర్వాత ఆయన గుజరాత్‌కు తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వెంటనే సహాయం అందించి తన విమానాన్ని అందుబాటులో ఉంచారు. షిండే విమానంలో షా మరియు అతని కుటుంబం గుజరాత్‌కు బయలుదేరారు.

అమిత్ షా విమానంలో సాంకేతిక సమస్య.. అప్రమత్తమైన అధికారులు.. !
Amit Shah Plane
Balaraju Goud
|

Updated on: Aug 30, 2025 | 7:06 PM

Share

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న విమానంలో ముంబైలో సాంకేతిక లోపం ఏర్పడింది. రెండు రోజుల ముంబై పర్యటన తర్వాత ఆయన గుజరాత్‌కు తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వెంటనే సహాయం అందించి తన విమానాన్ని అందుబాటులో ఉంచారు. షిండే విమానంలో షా మరియు అతని కుటుంబం గుజరాత్‌కు బయలుదేరారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. శనివారం(ఆగస్టు 30) హోంమంత్రి అమిత్ షా తన రెండు రోజుల ముంబై పర్యటన ముగించుకుని గుజరాత్ కు బయలుదేరబోతుండగా ఈ సంఘటన జరిగింది. విమానంలో సాంకేతిక లోపం గురించి సమాచారం అందిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వెంటనే ముందుకు వచ్చి తన విమానాన్ని హోంమంత్రికి, ఆయన కుటుంబ సభ్యులకు అందించారని అధికారవర్గాలు తెలిపాయి. ఎట్టకేలకు ఏక్‌నాథ్ షిండే విమానంలో అమిత్ షా గుజరాత్ కు పయనమయ్యారు. సకాలంలో విమానంలో సాంకేతిక లోపం గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు. కాగా, ఇందుకు సంబంధించి అధికారులు దర్యాప్తు చేపట్టారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం రాత్రి మహారాష్ట్రకు చేరుకున్నారు. ఈ ఉదయం ఆయన రాష్ట్ర ప్రభుత్వ సహ్యాద్రి అతిథి గృహంలో షిండే, ఆర్‌ఎస్‌ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి అతుల్ లిమాయే, మహారాష్ట్ర బిజెపి అధ్యక్షుడు రవీంద్ర చవాన్, కొత్తగా నియమితులైన ముంబై బీజేపీ చీఫ్ అమిత్ సతంతో చర్చలు జరిపారు. అనంతరం, హోంమంత్రి అమిత్ షా శనివారం గణేష్ ఉత్సవ్ కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నివాసానికి వెళ్లారు. దీని తర్వాత, ఆయన తన కుటుంబంతో కలిసి ప్రసిద్ధ లాల్‌బాగ్చా రాజ గణపతిని సందర్శించారు. ఆయన డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే, రాష్ట్రంలోని పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు.

రెండు రోజుల పర్యటన సందర్భంగా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తవ్డే హోంమంత్రి అమిత్ షాను సహ్యాద్రి గెస్ట్ హౌస్‌లో కలిశారు. ఇద్దరు నాయకుల ఈ సమావేశంలో, రాబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికలు, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, సంస్థాగత విషయాలపై చర్చించారని భావిస్తున్నారు. మరాఠా రిజర్వేషన్ ఉద్యమం గురించి అమిత్ షా ముఖ్యమంత్రి ఫడ్నవీస్ , మంత్రి ఆశిష్ షెలార్ నుండి సమాచారం తీసుకున్నారని వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..