AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amit Shah: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల జాడ లేకుండా చేస్తాం: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

జమ్ముకశ్మీర్‌లో శాంతిని నెలకొల్పడానికి కేంద్రం మరిన్ని కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ కార్యాలయంలో అమిత్‌షా అధ్యక్షతన హైలెవెల్‌ మీటింగ్‌ జరిగింది. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ , ఆర్మీ చీఫ్‌ మనోజ్‌పాండే , జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌సిన్హా , రా అధికారులు హాజరయ్యారు.

Amit Shah: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల జాడ లేకుండా చేస్తాం: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా
Union Home Minister Amit Shah
Basha Shek
|

Updated on: Jan 03, 2024 | 6:30 AM

Share

జమ్ముకశ్మీర్‌లో శాంతిని నెలకొల్పడానికి కేంద్రం మరిన్ని కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ కార్యాలయంలో అమిత్‌షా అధ్యక్షతన హైలెవెల్‌ మీటింగ్‌ జరిగింది. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ , ఆర్మీ చీఫ్‌ మనోజ్‌పాండే , జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌సిన్హా , రా అధికారులు హాజరయ్యారు. జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించారు. వీలైనంత త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్రం ఇప్పటికే పార్లమెంట్‌ సాక్షిగా జమ్ముకశ్మీర్‌ ప్రజలకు హామీ ఇచ్చింది. 2026 నాటికి జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదం జాడ లేకుండా చేస్తామని ఈ సమావేశంలో అమిత్‌షా స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్‌లో శాంతిభద్రతలపై కూడా ఈ సమావేశంలో అమిత్‌షా సమీక్ష నిర్వహించారు. గత రెండు నెలలుగా కశ్మీర్‌లో ఉగ్రదాడులు పెరిగిపోవడంపై సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్‌ పోలీసులు , సీఆర్‌పీఎఫ్‌ , ఆర్మీ బలగాలు మరింత సమన్వయంతో పనిచేయాలని అమిత్‌షా సూచించారు. డిసెంబర్‌ రెండుసార్లు ఆర్మీ కాన్వాయ్‌పై దాడి చేశారు ఉగ్రవాదులు. రాజౌరిలో ఆర్మీ కాన్వాయ్‌పై దాడిలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు . ఈ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకుంది కేంద్రం . పాకిస్తాన్‌ నుంచి చొరబడ్డ 30 మంది ముష్కరుల కోసం భద్రతా బలగాల వేట కొనసాగిస్తున్నాయి.

కాగా గతేడాది రాజౌరీ, పూంచ్, రియాసీ జిల్లాల్లో జరిగిన వరుస ఎన్‌కౌంటర్లలో 28 మంది ఉగ్రవాదులు, 19 మంది భద్రతా సిబ్బంది సహా 54 మంది మరణించారు. ముఖ్యంగా రాజౌరిలో 10 మంది ఉగ్రవాదులు, 14 మంది భద్రతా సిబ్బంది సహా 31 మంది మరణించారు. పూంచ్‌లో 15 మంది ఉగ్రవాదులు, ఐదుగురు భద్రతా సిబ్బంది హతమయ్యారు. రియాసిలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. గత ఏడాది మేలో చమ్రేర్ అడవుల్లో జరిగిన యాంటీ టెర్రర్ ఆపరేషన్‌లో ఐదుగురు ఆర్మీ సిబ్బంది మరణించగా, ఒక ఉన్నతాధికారి గాయపడ్డారు. ఈ ఆపరేషన్‌లో ఓ విదేశీ ఉగ్రవాది కూడా హతమయ్యాడు. ఉగ్రవాదుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మరిన్ని భద్రతా చర్యలు చేపట్టాలని భద్రతా సంస్థలకు అమిత్‌ షా సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉగ్రవాదంపై పోరాటాన్ని కొనసాగిస్తుందని హోంమంత్రి పునరుద్ఘాటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వీటిని పచ్చిగా తింటే మీ మెదడులోకి పురుగులు వెళ్లడం పక్కా..!
వీటిని పచ్చిగా తింటే మీ మెదడులోకి పురుగులు వెళ్లడం పక్కా..!
హోలీకి ప్రత్యేక రైళ్లు! పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!
హోలీకి ప్రత్యేక రైళ్లు! పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!
'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు' వెబ్ సిరీస్ రివ్యూ..
'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు' వెబ్ సిరీస్ రివ్యూ..
బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. నలుగురు దుర్మరణం..
బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. నలుగురు దుర్మరణం..
తొలి ట్రోఫీ గెలిచిన జమ్మూ కాశ్మీర్.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.?
తొలి ట్రోఫీ గెలిచిన జమ్మూ కాశ్మీర్.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.?
గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డపై రామచిలుక మ్యాజిక్‌..! ఆ తర్వాత
గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డపై రామచిలుక మ్యాజిక్‌..! ఆ తర్వాత
మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం
మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం
బిగ్‌బాస్‌కు వెళ్లి తప్పు చేశాను.. టాలీవుడ్ నటి సంచలన కామెంట్స్
బిగ్‌బాస్‌కు వెళ్లి తప్పు చేశాను.. టాలీవుడ్ నటి సంచలన కామెంట్స్
బ్రేక్‌ఫాస్ట్‌లోకి అదిరిపోయే రాగి రవ్వ దోశలు.. ఎలా చేసుకోవాలంటే?
బ్రేక్‌ఫాస్ట్‌లోకి అదిరిపోయే రాగి రవ్వ దోశలు.. ఎలా చేసుకోవాలంటే?
ఆదివారమే హాలిడే ఎందుకు..? సండే సెలవు వెనుక ఇంత పెద్ద కథ ఉందా..
ఆదివారమే హాలిడే ఎందుకు..? సండే సెలవు వెనుక ఇంత పెద్ద కథ ఉందా..