AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై అన్ని కార్యక్రమాలు జోహో ఆఫీస్ సూట్‌ ద్వారానే..!

స్వదేశీ డిజిటల్ సాధనాలను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. తన అధికారులందరినీ అధికారిక వ్యవహారాల కోసం జోహో ఆఫీస్ సూట్‌ను ఉపయోగించాలని ఆదేశించింది. ఇది స్వదేశీ డిజిటల్ స్వావలంబన వైపు ఒక ప్రధాన అడుగుగా పరిగణించడం జరుగుతుంది. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల జోహో మెసేజింగ్ యాప్ అరత్తరిని ప్రశంసించిన తర్వాత ఈ ఆదేశం వచ్చింది.

విద్యా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై అన్ని కార్యక్రమాలు జోహో ఆఫీస్ సూట్‌ ద్వారానే..!
Uion Minister Dharmendr Pradhan On Sridhar Vembu Zoho
Balaraju Goud
|

Updated on: Oct 07, 2025 | 8:56 PM

Share

స్వదేశీ డిజిటల్ సాధనాలను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. తన అధికారులందరినీ అధికారిక వ్యవహారాల కోసం జోహో ఆఫీస్ సూట్‌ను ఉపయోగించాలని ఆదేశించింది. ఇది స్వదేశీ డిజిటల్ స్వావలంబన వైపు ఒక ప్రధాన అడుగుగా పరిగణించడం జరుగుతుంది. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల జోహో మెసేజింగ్ యాప్ అరత్తరిని ప్రశంసించిన తర్వాత ఈ ఆదేశం వచ్చింది. ఈ నిర్ణయం ‘స్వావలంబన భారతదేశం’ అనే ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఉంది.

ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా క్లౌడ్ ఆధారిత వ్యాపార పరిష్కారాలను అందించే కొన్ని బ్రాండ్లలో భారతీయ టెక్నాలజీ కంపెనీ జోహో ఒకటి. ఈ కంపెనీ చిన్న స్టార్టప్‌ల నుండి పెద్ద సంస్థల వరకు అన్ని పరిమాణాల వ్యాపారాల కోసం సమగ్ర సాఫ్ట్‌వేర్ సూట్‌ను అభివృద్ధి చేసింది. జోహోలో అమ్మకాలు, మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్‌ఆర్, ఐటి నిర్వహణతో సహా విస్తృత శ్రేణి వ్యాపార విధులను కవర్ చేసే 55 కి పైగా ఇంటిగ్రేటెడ్ అప్లికేషన్‌లు రూపొందించారు. ఈ ప్లాట్‌ఫామ్ కంపెనీలు సంక్లిష్టమైన సెటప్ లేదా గణనీయమైన ఓవర్‌హెడ్ లేకుండా మొత్తం వర్క్‌ఫ్లోను డిజిటల్‌గా నిర్వహించడానికి అనుమతిస్తుంది. దాని సరసమైన ధర, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఆల్-ఇన్-వన్ ప్లాట్‌ఫామ్‌తో, జోహో.. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజాలకు నమ్మకమైన ప్రత్యామ్నాయంగా మారిపోయింది.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మనిర్భర భారత్ నిర్మాణంలో భాగంగా అన్ని రంగాల్లో స్వదేశీ సత్తా చాటుతోంది. ఇందులో భాగంగా స్వదేశీ డిజిటల్ సాధనాలకు ప్రోత్సహం లభిస్తోంది. తాజాగా కేంద్ర ఉన్నత విద్యా శాఖ జారీ చేసిన సర్క్యులర్‌లో, జోహోను ఉపయోగించాలని పేర్కొంది. ఇకపై విదేశీ సాఫ్ట్‌వేర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని సూచించింది. భారతదేశ దేశీయ సాంకేతిక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి విస్తృత వ్యూహంలో భాగమని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పేర్కొంది. జోహోలో తమ పత్రాలు, స్ప్రెడ్‌షీట్‌లు, ప్రెజెంటేషన్‌లను సృష్టించడం, సవరించడం, షేర్ చేయడం, టీమ్ వర్క్, కమ్యూనికేషన్ కోసం దాని సహకార సాధనాలను ఉపయోగించాలని ఈ ఆర్డర్ ద్వారా విద్య శాఖ ఉద్యోగులను కోరింది.

ఈ సూట్‌ను NIC మెయిల్ ప్లాట్‌ఫామ్‌లో విలీనం చేశారు. ప్రత్యేక లాగిన్ లేదా ఇన్‌స్టాలేషన్ అవసరాన్ని తొలగిస్తుంది. ఈ చర్య వర్క్‌ఫ్లోను మెరుగుపరుస్తుందని, గ్రూప్ సమన్వయాన్ని మెరుగుపరుస్తుందని, డేటా భద్రతను బలోపేతం చేస్తుందని అధికారులు విశ్వసిస్తున్నారు. ప్రభుత్వంలో “సురక్షితమైన, స్కేలబుల్ IT పర్యావరణ వ్యవస్థను” నిర్మించడానికి ఈ నిర్ణయాన్ని ధైర్యమైన ముందడుగుగా సీనియర్ అధికారులు అభివర్ణించారు.

స్వదేశీ డిజిటల్ సాధనాలను ప్రోత్సహించే ఈ చొరవ ఇప్పుడు అనేక మంత్రిత్వ శాఖలకు విస్తరిస్తోంది. గతంలో, ఐటీ, సమాచార, ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా తన అధికారిక కార్యకలాపాల కోసం జోహో ఆఫీస్ సూట్‌ను ఉపయోగిస్తానని పేర్కొన్నారు. కాగా, జోహో సంస్థ రూపొందించి ఈ అప్లీకేషన్ అతిపెద్ద బలం దాని గోప్యతా విధానం. గ్లోబల్ చాట్ యాప్‌లు తరచుగా వినియోగదారు డేటాను దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. అయితే స్వదేశం తయారైన ఈ అఫ్లికేషన్ ఎలాంటి డబ్బు ఆర్జన కోసం వినియోగదారు డేటాను ఉపయోగించదని జోహో పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..