AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WITT: టీవీ9 ‘వాట్ ఇండియా టుడే’లో ‘జై కిసాన్, క్యా సమాధాన్’ కార్యక్రమం.. ప్రసంగించనున్న కేంద్ర మంత్రి..

టీవీ9 నెట్‌వర్క్ నిర్వహించనున్న 'వాట్ ఇండియా టుడే'లో 'జై కిసాన్, క్యా సమాధాన్' అంశంపై కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రైతుల డిమాండ్లను, వాటికి సంబంధించిన పరిష్కారాలను ప్రతిపాదించవచ్చు. వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమం ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు ఢిల్లీలో జరగనుంది.

WITT: టీవీ9 'వాట్ ఇండియా టుడే'లో 'జై కిసాన్, క్యా సమాధాన్' కార్యక్రమం.. ప్రసంగించనున్న కేంద్ర మంత్రి..
Arjun Munda Witt
Srikar T
| Edited By: |

Updated on: Feb 24, 2024 | 4:39 PM

Share

టీవీ9 నెట్‌వర్క్ నిర్వహించనున్న ‘వాట్ ఇండియా టుడే’లో ‘జై కిసాన్, క్యా సమాధాన్’ అంశంపై కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రైతుల డిమాండ్లను, వాటికి సంబంధించిన పరిష్కారాలను ప్రతిపాదించవచ్చు. వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమం ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు ఢిల్లీలో జరగనుంది. ‘వాట్ ఇండియా టుడే థింక్స్’ కార్యక్రమం ద్వారా టీవీ9 నెట్ వర్క్ పలు అంశాలపై చర్చించనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.

ఈ ఈవెంట్‎కు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా పాల్గొంటారు. దేశంలోని రైతుల అసంతృప్తితో పాటు వారి ఉద్యమం ముగింపుకు సంబంధించిన కొన్ని అంశాలను అర్జున్ ముండా ఉదహరించవచ్చు. 3 మంది కేంద్ర మంత్రుల బృందం ఇప్పటికే అర్జున్‎తో ఉద్యమాన్ని ముగించడంపై పలు దఫాలుగా చర్చలు జరిపింది. ‘జై కిసాన్, క్యా సమాధాన్’ అనే అంశంపై అర్జున్ ముండా మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా రైతుల డిమాండ్లు, వారి సమస్యల పరిష్కారంపై మాట్లాడవచ్చు. అయితే ఇప్పటికే ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగినా అవి విఫలమయ్యాయి. ఇప్పుడు తమ నిరసనను మరింత ఉధృతం చేయాలని రైతులు చెబుతున్నారు.

గత రెండ్రోజులుగా సాగుతున్న రైతు ఉద్యమంపై వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా ఇప్పటికే మీడియా ముందు మాట్లాడారు. అనేక దఫాల చర్చల్లో కొన్ని విషయాల్లో అంగీకారం కుదరలేదు. వీటి సాధ్యాసాధ్యాలపై కొన్ని ప్రయత్నాలు జరుగుతాయి. రైతుల ప్రయోజనాల కోసం మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటివరకు 4సార్లు జరిగిన భేటీల్లో చాలా అర్థవంతమైన చర్చలు జరిగాయి. అందరికీ ఆసక్తి కలిగించే అటువంటి పరిష్కారాన్ని మేము కోరుకుంటున్నాము అని తెలిపారు. చర్చల ద్వారానే ఈ పరిష్కారం సాధ్యమవుతుంది.

ఇవి కూడా చదవండి

మళ్లీ మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రైతుల ఉద్యమం ఢిల్లీకి చేరకుండా హర్యానా, పంజాబ్ సరిహద్దుల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పంజాబ్, హర్యానాలోని అనేక జిల్లాల్లో ఇంటర్నెట్ కూడా నిషేధించబడింది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలుతో పాటు, పెన్షన్, పోలీసు కేసుల ఉపసంహరణ, 2021 లఖింపూర్ ఖేరీ హింసాకాండ బాధితులకు న్యాయం, విద్యుత్ రేట్ల పెంపు, 2020లో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇలా 21 అంశాలతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు