PM Modi: భారత్‌ జోడో యాత్రలో పాల్గొంటున్నది వాళ్లే.. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..

బీజేపీని మరోసారి గెలిపించాల్సిన బాధ్యత గుజరాతీలపై ఉందన్నారు ప్రధాని మోదీ. నర్మదా డ్యాంకు వ్యతిరేకంగా ఉద్యమించిన వాళ్లే భారత్‌జోడో యాత్రలో పాల్గొంటున్నారని రాహుల్‌పై విమర్శలు చేశారు.

PM Modi: భారత్‌ జోడో యాత్రలో పాల్గొంటున్నది వాళ్లే.. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
Pm Modi
Follow us

|

Updated on: Nov 21, 2022 | 10:34 AM

గుజరాత్‌లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం బిజీబిజీగా కొనసాగుతోంది. ప్రచారానికి ముందు ఆదివారం సోమనాథ్‌ ఆలయాన్ని సందర్శించారు మోదీ.. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గుజరాత్‌లో బీజేపీకి మరో విజయం కట్టబెట్టి కొత్త రికార్డులు సృష్టించాలని పిలుపునిచ్చారు మోదీ. భారీగా ఓటింత్‌ శాతం నమోదయ్యేలా చూడాలని బీజేపీ కార్యకర్తలను కోరారు. అభివృద్ధి చెందిన, సౌభాగ్యవంతమైన రాష్ట్రంగా గుజరాత్‌ను తీర్చిదిద్దడమే బీజేపీ లక్ష్యమన్నారు మోదీ. ఈ లక్ష్య సాధనకు ప్రజల ఆశీర్వాదాలు కావాలన్నారు. గుజరాతీలు, కచ్-కథియవాడ్ ప్రజలు తన గురువులని, వారి ఆశీర్వాదాలు తనకు కావాలని కోరారు. రాజ్‌కోట్ జిల్లా ధోరాజీలో జరిగిన సభలో పాల్గొన్న ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.

రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్రపై విమర్శలు

రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్రపై విమర్శలు చేశారు మోదీ. నర్మదా డ్యాం నిర్మాణాన్ని వ్యతిరేకించిన మేథాపాట్కర్‌ భారత్‌ జోడో యాత్రకు హాజరైన విషయాన్ని గుజరాత్‌ ప్రజలు గుర్తించాలని అన్నారు. సోమవారం గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ పాల్గొంటారు. కచ్‌లో ఎడారి పెద్ద సమస్యగా ఉండేదని, దానిని గుజరాత్ ముఖద్వారంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు మోదీ. సౌరాష్ట్రలో అమ్రేలీ, బోటాడ్‌లలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో మోదీ పాల్గొన్నారు. ఈ రోజు ప్రధాని మోడీ సురేంద్రనగర్, భరూచ్, నవ్సారిలో మూడు ర్యాలీలు నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాని మోడీ.. ఆదివారం రాత్రి హఠాత్తుగా పార్టీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం అక్కడున్న కార్యకర్తలు, నాయకులతో ముచ్చటించారు. కాగా, చాలా కాలం తర్వాత అకస్మాత్తుగా ప్రధాని మోదీ తమ మధ్యకు రావడంతో పార్టీ కార్యకర్తలు సంతోషం వ్యక్తంచేశారు.

గుజరాత్‌లో 182 శాసన సభ స్థానాలున్నాయి. డిసెంబరు 1, 5 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది, డిసెంబరు 8న ఓట్ల లెక్కింపు, పలితాల వెల్లడి జరుగుతాయి. రెబల్స్‌కు బరి లోకి దిగిన ఏడుగురు ఎమ్మెల్యేలను బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..