Mangalore Blast: కోయంబత్తూరు పేలుడుకు.. మంగళూర్‌ బ్లాస్ట్‌తో లింకులు.. ప్రైవేట్ టీచర్ సహా మరో ఇద్దరు అరెస్ట్‌

 దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మంగళూరు పేలుడు కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఈ బాంబ్ బ్లాస్ట్ కేసులో కీలక సూత్రధారితో సాన్నిహిత్యంగా ఉన్న ఇద్దరిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. పేలుళ్లకు కుట్ర పన్నిన మహ్మద్ షరీఖ్‌కు సహకరించిన ఇద్దరిని కర్ణాటకలో అదుపులోకి తీసుకున్నారు.

Mangalore Blast: కోయంబత్తూరు పేలుడుకు.. మంగళూర్‌ బ్లాస్ట్‌తో లింకులు.. ప్రైవేట్ టీచర్ సహా మరో ఇద్దరు అరెస్ట్‌
Mangalore Blast
Follow us

|

Updated on: Nov 21, 2022 | 8:56 AM

Mangalore Blast Case: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మంగళూరు పేలుడు కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఈ బాంబ్ బ్లాస్ట్ కేసులో కీలక సూత్రధారితో సాన్నిహిత్యంగా ఉన్న ఇద్దరిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. పేలుళ్లకు కుట్ర పన్నిన మహ్మద్ షరీఖ్‌కు సహకరించిన ఇద్దరిని కర్ణాటకలో అదుపులోకి తీసుకున్నారు. షరీఖ్‌తో ఎలాంటి సంబంధాలున్నాయి..? ఇంకా ఎవరెవరితో పరిచయముంది అన్న అంశాలపై పోలీసులు, ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగి.. పలు కీలకవిషయాలను సేకరించింది. దీనివెనుక ఉగ్రసంస్థలు ఉన్నట్లు ఇప్పటికే నిర్ధారించారు. కాగా, PFI సంస్థతో షరీఖ్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని నిర్ధారించారు. పేలుడుకు ముందు తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో తిరిగాడు షరీఖ్‌. ఫేక్‌ ఆధార్‌కార్డుతో కర్నాటక లోని పలు ప్రాంతాల్లో గదిని అద్దెకు తీసుకున్నాడు. 2020లో కూడా ఉగ్రవాద నిరోధక చట్టం కింద షరీఖ్‌ అరెస్టయ్యాడు. అనంతరం సాంకేతిక కారణాల వల్ల షరీఖ్ బెయిల్‌పై విడుదలయ్యాడు. పేలుడుకు ముందు తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో షరిఖ్ తిరిగాడని.. పలువురిని కలిసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. వారందరినీ.. పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మంగళూరు బ్లాస్ట్ కేసు విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని పేర్కొంటున్నారు.

ప్రైవేట్ టీచర్ అరెస్ట్..

ఈ కేసులో ఓ ప్రైవేట్‌ టీచర్‌ను ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పేలుడుకు కారణమైన మహ్మద్‌ షరీఖ్‌కు కోయంబత్తూరు లింకులు ఉన్నట్లు గురర్తించారు. కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్‌ టీచర్‌ సురేందర్‌.. గాంధీపురంలోని లాడ్జిలో నెల క్రితం ఉన్నట్టు సమాచారం. ఊటీలో స్కూల్‌ టీచర్‌గా సురేందర్‌ పనిచేస్తున్న సురేందర్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు విచారించేందుకు సిద్దమవుతున్నారు.

అయితే, తమిళనాడు.. కోయంబత్తూరు పేలుడుకు మంగళూర్‌ బ్లాస్ట్‌కు సంబంధాలు ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. PFI సంస్థపై నిషేధానికి ప్రతీకారంగా అరాచకశక్తులు ఈ పేలుడుకు కుట్ర పన్నినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆటోలో పేలుడుపై మంగళూరు పోలీసులతో పాటు ఎన్‌ఐఏ కూడా దర్యాప్తు చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Latest Articles
T20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు.. కెప్టెన్ ఎవరో అసలు ఊహించలేరు
T20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు.. కెప్టెన్ ఎవరో అసలు ఊహించలేరు
ఒకే గడ్డపై ఇద్దరు అగ్ర నేతలు.. ఏం మాట్లాడతారన్న సర్వత్రా ఆసక్తి!
ఒకే గడ్డపై ఇద్దరు అగ్ర నేతలు.. ఏం మాట్లాడతారన్న సర్వత్రా ఆసక్తి!
బీఆర్ఎస్ నామమాత్రంగా పోటీః రేవంత్
బీఆర్ఎస్ నామమాత్రంగా పోటీః రేవంత్
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
కోహ్లీ సెంచరీ మిస్.. పటిదార్ మెరుపులు.. RCB భారీ స్కోరు
కోహ్లీ సెంచరీ మిస్.. పటిదార్ మెరుపులు.. RCB భారీ స్కోరు
పిండి రుబ్బకుండానే.. జస్ట్ పది నిమిషాల్లో గారెలు చేయొచ్చు..
పిండి రుబ్బకుండానే.. జస్ట్ పది నిమిషాల్లో గారెలు చేయొచ్చు..
తిరుగులేని టీమిండియా..బంగ్లాను క్లీన్‌స్వీప్ చేసిన భారత అమ్మాయిలు
తిరుగులేని టీమిండియా..బంగ్లాను క్లీన్‌స్వీప్ చేసిన భారత అమ్మాయిలు
నవనీత్‌ కౌర్‌ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలి.. సీఎం రేవంత్
నవనీత్‌ కౌర్‌ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలి.. సీఎం రేవంత్
గుజరాత్ నాయకులపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
గుజరాత్ నాయకులపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
ఐపీఎల్ యంగ్ ప్లేయర్ల సత్తా.. త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ..
ఐపీఎల్ యంగ్ ప్లేయర్ల సత్తా.. త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ..