AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: టార్గెట్ 2024 ఎన్నికలే.. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ భేటీ..

బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు ప్రధాని మోదీ. ఢిల్లీ లోని బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో ఈ సమావేశం జరిగింది. 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

PM Modi: టార్గెట్ 2024 ఎన్నికలే.. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ భేటీ..
Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: May 29, 2023 | 7:13 AM

Share

బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు ప్రధాని మోదీ. ఢిల్లీ లోని బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో ఈ సమావేశం జరిగింది. 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా ఈ సమావేశంలో పోస్ట్‌మార్టమ్‌ చేశారు. బీజేపీ ఓటమిపై విశ్లేషణ జరుగుతోంది. దాదాపు ఆరుగంటల పాటు ఈ సమావేశం కొనసాగుతుంది. బీజేపీ అధ్యక్షుడు నడ్డా , హోంశాఖ మంత్రి అమిత్షా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆయా రాష్ట్రాల్లో అమలౌతున్న అభివృద్ది పథకాల గురించి సీఎంలు ప్రధాని మోదీకి వివరించారు. 2024 పార్లమెంట్ ఎన్నికల గురించి ప్రధాని మోడీతో ఆయా రాష్ట్రాల సీఎంలు చర్చించారు. ఈ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై నేతలకు ప్రధాని దిశా నిర్ధేశం చేశారు.

ఈ సమావేశంలో మహరాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ , హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, అసోం సీఎం హిమంత బిశ్వాస్ , ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ,ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి,గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్, నాగాలాండ్ డిప్యూటీ సీఎం యత్రుంగో , మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్త్రిపుర సీఎం మాణిక్ సాహా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. న్యూఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభించిన తర్వాత ఈ సమావేశం జరిగింది.

ఇవి కూడా చదవండి

2024 పార్లమెంట్ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి మూడో దఫా విజయం సాధించాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ఆయా రాష్ట్రాల్లో ప్రత్యర్ధుల బలాలు, బలహీనతలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఏ వ్యూహాంతో ముందుకు వెళ్తే ఎక్కువ సీట్లు దక్కే అవకాశం ఉందనే విషయమై చర్చించనున్నారు. మరో వైపు ప్రధాని మోడీ 9 ఏళ్లలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయమై సీఎంలతో చర్చించనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Follow Us
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?