AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: రాబోయే 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన భారత్‌గా మార్చండి.. 70 వేల మంది యువతకి ఉద్యోగ నియామక పత్రాలు అందించిన ప్రధాని మోదీ..

Rozgar Mela: కొత్తగా నియమితులైన దాదాపు 70,000 మందికి ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్ లెటర్‌లను అందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ జాబ్ మేళాలు ఎన్‌డిఎ, బిజెపి ప్రభుత్వానికి కొత్త గుర్తింపుగా మారాయని అన్నారు. బీజేపీ పాలిత ప్రభుత్వాలు కూడా ఇలాంటి జాబ్ మేళాలను..

PM Modi: రాబోయే 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన భారత్‌గా మార్చండి.. 70 వేల మంది యువతకి ఉద్యోగ నియామక పత్రాలు అందించిన ప్రధాని మోదీ..
PM Modi
Sanjay Kasula
|

Updated on: Jun 13, 2023 | 12:31 PM

Share

Employment Fair: ప్రధాని నరేంద్ర మోదీ 70 వేల మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలను అందించారు. నేషనల్ ఎంప్లాయ్‌మెంట్ ఫెయిర్ కింద వీరిని ఎంపిక చేశారు. ఇవాళ మంగళవారం (జూన్ 13) ఉదయం 10:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా నియమితులైన దాదాపు 70,000 మందికి ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్ లెటర్‌లను అందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ జాబ్ మేళాలు ఎన్‌డిఎ, బిజెపి ప్రభుత్వానికి కొత్త గుర్తింపుగా మారాయని అన్నారు. బీజేపీ పాలిత ప్రభుత్వాలు కూడా ఇలాంటి జాబ్ మేళాలను నిరంతరం నిర్వహిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ప్రధాని అన్నారు. ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలలో వచ్చే వారికి ఇది చాలా ముఖ్యమైన సమయం. రాబోయే 25 ఏళ్లలో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే తమ లక్ష్యమని ప్రధాని మోదీ అన్నారు.

ముద్రా యోజన కోట్లాది మంది యువతకు సహాయం చేసిందని ప్రధాని మోదీ అన్నారు. స్టార్ట్-అప్ ఇండియా, స్టాండ్-అప్ ఇండియా వంటి ప్రచారాలు యువత సామర్థ్యాన్ని మరింతగా పెంచాయి. ప్రభుత్వం నుంచి సహాయం పొందిన ఈ యువకులు ఇప్పుడు చాలా మంది యువకులకు ఉద్యోగాలు ఇస్తున్నారని ప్రశంసించారు ప్రధాని మోదీ.

అవినీతి ఒక గుర్తింపుగా మారింది

రాజకీయ అవినీతికి గత ప్రభుత్వాలు కేరాఫ్ అడ్రస్‌గా మారాయని కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ విమర్శించారు ప్రధాని మోదీ. వచ్చే 25 ఏళ్లలో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలి. ప్రపంచం మొత్తం భారత్‌ను విశ్వసిస్తోంది. అన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ భారతదేశం తన ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకువెళుతోంది.

విపక్షాలపై ప్రధాని మోదీ టార్గెట్‌

దేశంలో జరుగుతున్న ఈ ఉపాధి ప్రచారం కూడా పారదర్శకత, సుపరిపాలనకు నిదర్శనమని ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి ప్రధాని అన్నారు. మన దేశంలో కుటుంబ ఆధారిత రాజకీయ పార్టీలు ప్రతి వ్యవస్థలోనూ ఆశ్రిత పక్షపాతాన్ని ఎలా ప్రోత్సహిస్తున్నాయో మనం చూశాం. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో కూడా బంధుప్రీతి, అవినీతికి పాల్పడేవారు. ఈ పార్టీలు కోట్లాది మంది దేశ ప్రజలకు ద్రోహం చేశాయి. మా ప్రభుత్వం కూడా పారదర్శకతను తీసుకువచ్చింది. మేము ఆశ్రిత పక్షపాతాన్ని అంతం చేసాం.

ప్రధాని మోదీ ప్రసంగం ఇక్కడ వినండి..

కొత్తగా నియమితులైన వ్యక్తులు రాబోయే 25 ఏళ్లలో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకువెళతారని ప్రధాని అన్నారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగాలు కల్పించింది మోదీ ప్రభుత్వం. గత 5 ఉపాధి మేళాల్లో ఇప్పటి వరకు 4.29 లక్షల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. జూన్ 13వ తేదీ మంగళవారం దేశంలోని 43 చోట్ల ఉపాధి మేళాలు నిర్వహిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

Follow Us
ఒడిశా పారాదీప్‌ తీరానికి ఏపీ మత్స్యకారుల బోటు.. ఆ 10 మంది క్షేమం
ఒడిశా పారాదీప్‌ తీరానికి ఏపీ మత్స్యకారుల బోటు.. ఆ 10 మంది క్షేమం
బోటు బోల్తా పడటానికి ముందు ఆదివారం మధ్యాహ్నం ఏం జరిగింది..?
బోటు బోల్తా పడటానికి ముందు ఆదివారం మధ్యాహ్నం ఏం జరిగింది..?
ఇండోనేషియాలో మోదీ రెండో రోజు పర్యటన.. కీలక ఒప్పందాలు..!
ఇండోనేషియాలో మోదీ రెండో రోజు పర్యటన.. కీలక ఒప్పందాలు..!
కృష్ణ సినిమాకు నో చెప్పింది.. కట్ చేస్తే సినిమా సెన్సేషనల్ హిట్
కృష్ణ సినిమాకు నో చెప్పింది.. కట్ చేస్తే సినిమా సెన్సేషనల్ హిట్
మ్యూజియంలో 40 ఏళ్లుగా దుమ్ము పట్టిన ఎముక.. తీరా చూస్తే 8 కోట్ల
మ్యూజియంలో 40 ఏళ్లుగా దుమ్ము పట్టిన ఎముక.. తీరా చూస్తే 8 కోట్ల
సిగరెట్ మళ్లీ ముట్టరు.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు..
సిగరెట్ మళ్లీ ముట్టరు.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు..
అప్పుడు చిరిగిన బట్టలతో స్కూల్ వెళ్లిన పిల్లడు.. ఇప్పుడు
అప్పుడు చిరిగిన బట్టలతో స్కూల్ వెళ్లిన పిల్లడు.. ఇప్పుడు
జామకాయ vs ఆరెంజ్.. విటమిన్ సీ శక్తి ఎందులో ఎక్కువ ఉంటుంది..?
జామకాయ vs ఆరెంజ్.. విటమిన్ సీ శక్తి ఎందులో ఎక్కువ ఉంటుంది..?
దశాబ్దాలు గడిచినా చెక్కుచెదరని ‘కెప్టెన్ కూల్’ 5 రికార్డులు..!
దశాబ్దాలు గడిచినా చెక్కుచెదరని ‘కెప్టెన్ కూల్’ 5 రికార్డులు..!
ఇకపై సిలిండర్ల కొరత ఉండదు.. కేంద్రం కీలక నిర్ణయం..!
ఇకపై సిలిండర్ల కొరత ఉండదు.. కేంద్రం కీలక నిర్ణయం..!