AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓ ఇల్లాలి ఘాతుకం.. సెల్ఫీ దిగుదామని భర్తను చెట్టుకు కట్టేసి కిరోసిన్ పోసి తగలెట్టింది!

సెల్ఫీ తీసుకుందామంటూ భర్తను ఓ చెట్టుకు కట్టేసిందా ఇల్లాలు. అనతరం నోట్లో గుడ్డకుక్కి కిరోసిన్‌ పోసి తగలబెట్టింది. ఈ షాకింగ్‌ ఘటన బీహార్‌లో సోమవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌లోని ముజఫర్‌పుర్‌..

ఓ ఇల్లాలి ఘాతుకం.. సెల్ఫీ దిగుదామని భర్తను చెట్టుకు కట్టేసి కిరోసిన్ పోసి తగలెట్టింది!
Bihar Crme News
Srilakshmi C
|

Updated on: Jun 13, 2023 | 1:08 PM

Share

పట్నా: సెల్ఫీ తీసుకుందామంటూ భర్తను ఓ చెట్టుకు కట్టేసిందా ఇల్లాలు. అనతరం నోట్లో గుడ్డకుక్కి కిరోసిన్‌ పోసి తగలబెట్టింది. ఈ షాకింగ్‌ ఘటన బీహార్‌లో సోమవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌లోని ముజఫర్‌పుర్‌ జిల్లాలో సాహిబ్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిదిలోని వాసుదేవ్‌పుర్‌ సరాయ్‌ గ్రామానికి చెందిన 25 ఏళ్ల మహిళ సెల్ఫీ తీసుకుందామంటూ ఆదివారం రాత్రి ఓ చెట్టువద్దకు భర్తను తీసుకెళ్లింది. అనంతరం చెట్టుకు కట్టేసింది. నోట్లో గుడ్డలు కూడా కుక్కింది. అనంతరం అతని శరీరంపై కిరోసిన పోసి, నిప్పంటించింది. చెట్టు వద్ద మంటలు చెలరేగడంతో గ్రామస్థులు పరురుపరుగున వచ్చారు.

మంటల్లో చిక్కుకున్న బాధితుడు కాపాడంటూ హాహాకారాలు చేశాడు. వెంటనే గ్రామస్థులు బాధితుడిని కాపాడి, సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. గ్రామస్తులు నేరస్తురాలిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిడుతు సెల్ఫీ దిగుదామని తనను భార్య చెట్టుకు కట్టేసి, కిరోసిన్‌పోసి, నిప్పంటించినట్లు పోలీసులకు తెలిపాడు. మరొకరితో వివాహేతర సంబంధం ఉందని, అందుకే భర్తను అడ్డుతొలగించుకోవడానికి ఇంతటి దారుణానికి ఒడిగట్టిందని స్థానికులు చెబుతున్నారు. నిందితురాలిని అరెస్టు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసధికారి రాజేశ్‌ కుమార్ తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.