AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రష్యాకు ట్రంప్‌ వార్నింగ్‌.. ఇండియాలో భారీగా పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు! ఎలాగంటే..?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యాపై టారిఫ్‌లను విధించే బెదిరింపు భారతదేశం వంటి దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. రష్యా నుండి చమురు దిగుమతులపై ఆధారపడిన భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ మార్గాలను వెతకవలసి వచ్చే అవకాశం ఉంది.

రష్యాకు ట్రంప్‌ వార్నింగ్‌.. ఇండియాలో భారీగా పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు! ఎలాగంటే..?
Petrol And Diesel Prices
SN Pasha
|

Updated on: Jul 21, 2025 | 11:43 AM

Share

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ రష్యాకు వార్నింగ్‌ ఇచ్చారు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు.. ట్రంప్‌ రష్యాకు వార్నింగ్‌ ఇస్తే.. అది మన దేశంలోని పెట్రోల్‌, డీజిల్‌ వినియోగదారులకు భారంగా మారే అవకాశం ఉంది. అందుకు కారణం.. ప్రపంచ చమురు ఆర్థిక వ్యవస్థపై ఆయన వేసిన టారిఫ్ బాంబు బెదిరింపు. 50 రోజుల్లోపు ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించకపోతే, రష్యాతో వ్యాపారం చేసే అన్ని దేశాలపై 100 శాతం టారిఫ్ విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యాను హెచ్చరించారు. ట్రంప్ బెదిరింపు భారత్‌తో పాటు పలు దేశాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనుంది. రష్యా నుండి చౌకగా చమురును పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే దేశాలపై భారీ ఆర్థిక భారం పడే ప్రమాదం ఉంది.

భారత్‌ తన ముడి చమురు అవసరాలలో దాదాపు 35-40 శాతం రష్యా నుండి దిగుమతి చేసుకుంటోంది. ట్రంప్ హెచ్చరించినట్లు నిజంగానే రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై వంద శాతం పన్ను విధిస్తే అది మనకు కూడా వర్తిస్తుంది. రష్యా నుండి చమురు కొనుగోలుపై ఆర్థిక ఒత్తిడి పెరిగితే, భారతదేశం ప్రత్యామ్నాయ సరఫరా వనరులను కనుగొనవలసి ఉంటుంది, అది చౌకగా ఉండదు. దీని ఫలితం సామాన్యుడి జేబుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.

రష్యా నుండి సరఫరాకు అంతరాయం కలిగితే, అంతర్జాతీయ చమురు మార్కెట్లో సరఫరా సమతుల్యత దెబ్బతింటుందని, దీని కారణంగా ముడి చమురు ధరలు వేగంగా పెరుగుతాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. రష్యా ప్రపంచ చమురు సరఫరాలో 10 శాతం తొలగిస్తే, అది మిగిలిన దేశాలపై భారీ భారాన్ని మోపుతుందని, ధరలు ఆకాశాన్నంటుతాయని పెట్రోలియం మంత్రి హర్దీప్ పూరి ఇప్పటికే సూచించారు.

8 నుంచి 10 రూపాయలు పెరగవచ్చు..?

పరిస్థితి మరింత దిగజారితే భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 8 నుంచి 10 రూపాయలు పెరగవచ్చు. అటువంటి పరిస్థితిలో ట్రంప్ ఈ ‘టారిఫ్ గేమ్’ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను పెంచడమే కాకుండా, భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధారణ వినియోగదారుల జేబులను కూడా ప్రభావితం చేస్తుంది. చమురు మార్కెట్ ప్రస్తుతం జాగ్రత్తగా ఉంది, కానీ ట్రంప్ బెదిరింపు నిజమైన చర్యగా మారితే, ఇంధన ధరల పెరుగుదల ఖాయం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us