AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: విద్యార్థులు పరీక్షల్లో భయపడుతున్నారా? మోడీతో ప్రత్యేక చర్చా కార్యక్రమం.. మీ సందేహాలను వీడియో ద్వారా పంపండిలా..

విద్యార్థులకు పరీక్షల సమయం దగ్గర పడుతోంది. పరీక్షలు రాయాలంటే ఎన్నో భయాలు, ఆందోళలు ఉంటాయి. విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాము..

PM Modi: విద్యార్థులు పరీక్షల్లో భయపడుతున్నారా? మోడీతో ప్రత్యేక చర్చా కార్యక్రమం.. మీ సందేహాలను వీడియో ద్వారా పంపండిలా..
Pm Modi
Subhash Goud
|

Updated on: Jan 12, 2023 | 5:45 PM

Share

విద్యార్థులకు పరీక్షల సమయం దగ్గర పడుతోంది. పరీక్షలు రాయాలంటే ఎన్నో భయాలు, ఆందోళలు ఉంటాయి. విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాము. ఇక విద్యార్థుల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ పరీక్షా పే చర్చ కార్యక్రమం ద్వారా విద్యార్థులతో ముచ్చటించనున్నారు. ఈ కార్యక్రమం జనవరి 27న ఢిల్లీలోని తల్కటరా స్టేడియంలో జరుగనుంది. అయితే విద్యార్థులు తమ సందేహాలను ప్రధానమంత్రిని అడుగుదామని అనుకుంటే హెచ్‌డీ క్వాలిటీ కలిగిన వీడియోను జనవరి 15వ తేదీలోగా pibhyderabad@gmail.com ఈమెయిల్ ఐడికి పంపాలని అధికారులు తెలిపారు.

పరీక్షలు దగ్గరపడుతున్న నేపథ్యంలో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి, భయానికి లోనవుతుంటారు. వారిలో భయాన్ని పోగొట్టేందుకే ప్రధాని మోడీ ప్రతి సంవత్సరం ఇలాంటి ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మోడీ ప్రత్యేకంగా సంభాషించనున్నారని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ఈ ఏడాది పరీక్షలు రాయనున్న విద్యార్థుల ప్రశ్నలకు మోడీ సమాధానం ఇవ్వనున్నారు. వారిలో భయాన్ని పోగొట్టనున్నారు. ఈ కార్యక్రమంలో 9 నుంచి12 తరగతుల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొననున్నారు.

ఈ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ 2018 ఫిబ్రవరి 16న నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా మోదీ విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని, ఒత్తిడిని పోగొట్టి, పలు అంశాలపై వారు అడిగే సందేహాలను నివృత్తి చేస్తుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్