ఎయిర్పోర్టులో అధిక లగేజ్తో వచ్చిన మహిళ.. బాంబు ఉందని బెదిరించడంతో అంతా పరుగులు.. చివరికి
మహారాష్ట్రలోని ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అధిక లగేజ్ తీసుకొచ్చిన ఓ మహిళ తన బ్యాగులో బాంబు ఉందని చెప్పడంతో భద్రతా సిబ్బందిని ఉరుకులు పరుగులు పెట్టించడం కలకలం రేపింది.
మహారాష్ట్రలోని ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అధిక లగేజ్ తీసుకొచ్చిన ఓ మహిళ తన బ్యాగులో బాంబు ఉందని చెప్పడంతో భద్రతా సిబ్బందిని ఉరుకులు పరుగులు పెట్టించడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే దక్షిణ ముంబయికి చెందిన ఓ మహిళ తన కుటుంబంతో కలిసి కొల్కతా వెళ్లేందుకు ఇటీవల ముంబయి ఎయిర్పోర్టుకు వచ్చింది. కౌంటర్ వద్ద తన లగేజీని అప్పగించింగి. అయితే వాటి బరువు మొత్తం 22.05 కిలోలుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
వాస్తవానికి ఎయిర్లైన్ నిబంధనల ప్రకారం ఒక్కో దేశీయ ప్రయాణికుడు గరిష్ఠంగా 15 కిలోల వరకు లగేజి తీసుకెళ్లే అనుమతి ఉంటుంది. అదనపు లగేజీ ఉంటే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆ మహిళను డబ్బులు చెల్లించాలని అడగగా అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఎయిర్లైన్ సిబ్బందితో వాగ్వాదం జరగగా.. తన లగేజ్లో బాంబ్ ఉందంటూ బెదిరించింది. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారందరు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆమె బ్యాగును చెక్ చేయగా అలాంటిదేమి లేదని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఆ మహిళను సిబ్బంది పోలీసులకు అప్పగించారు. అయితే ఇతరుల ప్రాణాలకు, భద్రతకు ముప్పు వాటిల్లేలా ప్రవర్తించినందుకు ఆమెపై కేసు పెట్టి కోర్టులో హాజరుపరిచారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి