AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: పాలగ్లాసుతో వధువు ఎంట్రీ.. ఎన్నిసార్లు పిలిచినా తలుపు తీయని వరుడు.. కట్‌చేస్తే.!

ఫస్ట్‌నైట్ రోజున నవ వధువును పాలగ్లాసుతో శోభనం గదికి పంపించారు కుటుంబసభ్యులు. కట్ చేస్తే.. ఎన్నిసార్లు తలుపు కొట్టినా.. నో రెస్పాన్స్.

Viral: పాలగ్లాసుతో వధువు ఎంట్రీ.. ఎన్నిసార్లు పిలిచినా తలుపు తీయని వరుడు.. కట్‌చేస్తే.!
Viral
Ravi Kiran
|

Updated on: Jun 02, 2023 | 1:02 PM

Share

ఫస్ట్‌నైట్ రోజున నవ వధువును పాలగ్లాసుతో శోభనం గదికి పంపించారు కుటుంబసభ్యులు. కట్ చేస్తే.. ఎన్నిసార్లు తలుపు కొట్టినా.. నో రెస్పాన్స్. వెంటనే ఆమె బంధువులకు చెబుతుంది. వారు అక్కడికి వచ్చి చూడగా.. ఎదురుగా కనిపించిన దృశ్యానికి షాక్ అవుతారు. ఇంతకీ అసలేం జరిగిందంటే..

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్ జిల్లా మాచారియా గ్రామానికి చెందిన మనోజ్ యాదవ్‌కు మే 26న గోల్డీ అనే యువతితో వివాహం జరిగింది. వీరికి మే 28న శోభనం ముహూర్తాన్ని నిర్ణయించారు కుటుంబసభ్యులు. సాంప్రదాయ ప్రకారం అన్ని ఏర్పాట్లు చేశారు. రాత్రి 10 గంటల సమయంలో వధువును శోభనం గదికి పంపిస్తారు కుటుంబసభ్యులు. అయితే గదిలో ఉన్న వరుడు ఎన్నిసార్లు తలుపు తట్టినా తీయడు. ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. దీంతో వధువు సమాచారాన్ని కుటుంబసభ్యులకు చెబుతుంది. వారు అక్కడికి వచ్చి చూడగా.. వరుడు ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపిస్తాడు.దీంతో కుటుంబంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. కాగా, వరుడు ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉండగా.. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.