Medicines Prices: సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్.. తగనున్న ఔషధాల ధరలు.. వివరాలివే.!
Medicines Prices: సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ అందించనుంది. ఔషధాల ధరల భారాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టింది...
సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ అందించనుంది. ఔషధాల ధరల భారాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా క్యాన్సర్, టీబీ, షుగర్ వ్యాధుల నివారణకు ఉపయోగించే 39 రకాల మందులు, టీకాల ధరలు త్వరలోనే తగ్గనున్నాయి. ఈ క్రమంలోనే జాతీయ అత్యవసర ఔషధాల జాబితా(ఎన్ఎల్ఈఎం)ను కేంద్ర వైద్యారోగ్య శాఖ సవరించింది. ఈ లిస్టులో చేర్చిన మందుల ధరలను జాతీయ ఔషధ ధరల ప్రాధికార సంస్థ(ఎన్పీపీఏ) నిర్ణయించనుంది.
జాతీయ అత్యవసర ఔషధాల జాబితాలోకి 39 ఔషధాలను చేర్చడంతో పాటు.. మరో 16 ఔషధాలను ఆ లిస్టును తొలగించాలని కేంద్రం ప్రతిపాదించనుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తగ్గేందుకు ఉపయోగించే ఔషధాలు తొలగించే లిస్టులో ఉన్నాయని సమాచారం. వివిధ రకాల కారణాల వల్ల వీటిని ఎన్ఎల్ఈఎం నుంచి తొలగించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు స్పష్టం చేశారు.
Also Read: 11 ఏళ్ల కెరీర్లో 11 వికెట్లు కూడా తీయలేదు.. చెత్త బౌలింగ్కు ఇతడే నిదర్శనం.. ఎవరో తెలుసా!
ఓవైపు వ్యాపారం.. మరోవైపు సినిమాలతో దూసుకుపోతున్న ఈ అందాల తార ఎవరో గుర్తుపట్టారా.?
ట్రై యాంగిల్ లవ్స్టోరీ.. వివాహానికి లాటరీ పద్దతిలో యువతి ఎంపిక.. చివరకు..
టాలీవుడ్లో బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా…?