AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MBBS 2021-2022: విద్యా సంవత్సరం కుదింపు.. సెలవుల్లో కోత.. కరోనా వ్యాప్తి దృష్ట్యా నిర్ణయం

2021-22 లో కొత్తగా చేరే ఎంబీబీఎస్ విద్యార్థులకు విద్యాసంవత్సర కాలపరిమితిని జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) కుదించింది. దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైద్యవిద్య ఆలస్యం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

MBBS 2021-2022: విద్యా సంవత్సరం కుదింపు.. సెలవుల్లో కోత.. కరోనా వ్యాప్తి దృష్ట్యా నిర్ణయం
Mbbs
Ganesh Mudavath
| Edited By: |

Updated on: Feb 05, 2022 | 3:52 PM

Share

2021-22 లో కొత్తగా చేరే ఎంబీబీఎస్ విద్యార్థులకు విద్యాసంవత్సర కాలపరిమితిని జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) కుదించింది. దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైద్యవిద్య ఆలస్యం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మొదటి ఏడాది సహా అన్ని సంవత్సరాల వైద్యవిద్యను 11 నెలలే నిర్వహించేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలు కేవలం 2021–22 బ్యాచ్‌ వారికే వర్తిస్తాయని ఎన్‌ఎంసీ వెల్లడించింది. తొలి సంవత్సరం సహా మిగిలిన సంవత్సరాల్లోనూ పండుగలు, వేసవి సెలవులు కలుపుకొని సుమారు 2 నెలలు సెలవు దినాలుంటాయి. అయితే ఈ సెలవు రోజులను ఒక నెలకు కుదించింది. దీంతో విద్యార్థులకు 11 నెలల పాటు విద్యా బోధన కొనసాగుతుంది. 2021–22 బ్యాచ్‌ ఎంబీబీఎస్‌ విద్యార్థులకు ఈ నెలలో తరగతులు ప్రారంభమై ఇదే ఏడాది డిసెంబర్‌లో ముగుస్తాయి. సాధారణంగా ఫస్టియర్‌ కోర్సు కాలవ్యవధి 13 నెలలు, ఇతర సంవత్సరాల్లో 12 నెలలు ఉంటుంది. ఇందులో మొదటి ఏడాది ఒక నెల ఫౌండేషన్‌ కోర్సు ఉంటుంది. తాజా మార్పులతో ఈ కోర్సును రోజువారీ తరగతుల్లో భాగంగా అదనపు సమయం కేటాయించి బోధించాలని ఎన్‌ఎంసీ ఆదేశించింది.

2023 జనవరిలో ఈ బ్యాచ్‌ తొలి సంవత్సరం వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు. మళ్లీ అదే సంవత్సరం ఫిబ్రవరి నుంచి 11 నెలలపాటు రెండో ఏడాది తరగతులుంటాయి. ఇలా కొనసాగే వారి వైద్యవిద్య 2026 జూన్‌లో తుది సంవత్సరం పరీక్షలతో ముగుస్తుంది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలలు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని జాతీయ వైద్య కమిషన్‌ తాజాగా ఆదేశాలిచ్చింది. తాజా ఉత్తర్వులతో ఈ నెల 14 నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ మొదటి సంవత్సరం ఎంబీబీఎస్‌ వైద్య తరగతులు ప్రారంభించాల్సిందేనని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది.

Also Read

Andhra Pradesh: టంగుటూరు డబుల్‌ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు.. తల్లీకూతుళ్లను ఎందుకు చంపారంటే..

IND vs WI: మొదటి వన్డే ప్లేయింగ్ XIలో ఈ 11 మంది ఆటగాళ్లు.. రోహిత్‌ శర్మ స్పష్టమైన సంకేతం..?

JIO Users: జియో సేవలకు అంతరాయం.. ఆ సర్కిల్‌లో కాల్‌ కనెక్ట్‌ కావడం లేదు..?

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!