Covid-19: కరోనా అలర్ట్.. వ్యాక్సినేషన్‌, టెస్ట్‌లను పెంచండి.. కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవియా

భారతదేశంలో కోవిడ్-19 కేసుల పెరుగుదల దృష్ట్యా, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా గురువారం దేశంలో కోవిడ్ కేసులు, వ్యాక్సినేషన్ పరిస్థితిని సమీక్షించారు.

Covid-19: కరోనా అలర్ట్.. వ్యాక్సినేషన్‌, టెస్ట్‌లను పెంచండి.. కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవియా
Mansukh Mandaviya
Follow us

|

Updated on: Jun 24, 2022 | 5:58 AM

Mansukh Mandaviya – Coronavirus: దేశంలో కరోనా పీడ వదలడం లేదు. థర్డ్ వేవ్ అనతరం పోయిందనుకున్న మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఇటీవల కేసుల సంఖ్య పదివేలకు పైగా నమోదవుతోంది. కేసులు, పాజిటివిటీ రేటు పెరిగిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్తలపై ఫోకస్‌ పెట్టింది. ఇందులో భాగంగా వైద్యాధికారులతో సమావేశమయ్యారు కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి మన్సుఖ్‌ మాండవియా. భారతదేశంలో కోవిడ్-19 కేసుల పెరుగుదల దృష్ట్యా, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా గురువారం దేశంలో కోవిడ్ కేసులు, వ్యాక్సినేషన్ పరిస్థితిని సమీక్షించారు. కీలక నిపుణులు, అధికారులతో కేంద్ర మంత్రి సమావేశమయ్యారు. కోవిడ్ నియంత్రణకు వృద్ధులకు, పిల్లలకు టీకాలు వేయాలని సూచించారు. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాలపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. RT-PCR టెస్ట్‌ల సంఖ్య పెంచాలని.. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ జరపాలని రాష్ట్రాలకు ఆదేశించారు. అలాగే వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాలని కేంద్రమంత్రి సూచించారు. అధిక కేసులు నమోదయ్యే జిల్లాల్లో బూస్టర్ డోస్‌లతో సహా టీకాల వేగాన్ని పెంచాలని మన్సుఖ్ మాండవియా సూచించారు. ఏదైనా మ్యూటేషన్ వ్యాప్తి చెందే అవకాశం ఉందేమో పరిశీలించాలని.. రాష్ట్రాల వారీగా నివేదిక అందజేయాలని ఆదేశించారు.

కాగా.. దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా గురువారం 13,313 కేసులు నమోదవగా..38మంది మృతి చెందారు. రోజురోజుకీ పాజిటివిటీ రేటు పెరిగిపోతోంది. నిన్నటికంటే ఇవాళ 8.7శాతం మేర పెరిగాయి కొవిడ్‌ కేసులు. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 83,990కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 2వేలకు చేరువలో ఉన్నాయి రోజువారీ కేసులు. కొత్తగా 1934మంది కరోనా బారిన పడ్డారు. అక్కడ యాక్టివ్‌ కేసుల సంఖ్య 5755కి చేరింది. ఇక తెలంగాణలో 5వందలకు చేరువలో ఉన్నాయి కేసులు. కొత్తగా 494మందికి వైరస్‌ సోకింది. వాటిలో హైదరాబాద్‌లోనే 315 కేసులు ఉన్నాయి.

గత రెండు వారాలుగా భారతదేశంలో అత్యధిక సంఖ్యలో COVID-19 కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో రోజుకు 1,000 కేసులు నమోదవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు