Maharashtra Crisis: శివసేన కీలక నిర్ణయం.. 12 మంది రెబల్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సిఫారసు..

శివసేన మరో కీలక నిర్ణయం తీసుకుంది.. 12 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని శివసేన (shivsena) మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌కు లేఖ రాసింది.

Maharashtra Crisis: శివసేన కీలక నిర్ణయం.. 12 మంది రెబల్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సిఫారసు..
Uddhav Thackeray
Follow us

|

Updated on: Jun 24, 2022 | 12:12 AM

Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏక్‌నాథ్‌ షిండే తిరుగుబాటుతో ఉద్ధవ్‌ సర్కార్‌ మైనార్టీలో పడిపోయింది. అన్నిదారులూ మూసుకుపోవడంతో ఉద్ధవ్ గద్దె దిగేందుకు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో శివసేన మరో కీలక నిర్ణయం తీసుకుంది.. 12 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని శివసేన (shivsena) మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌కు లేఖ రాసింది. బుధవారం జరిగిన సమావేశానికి హాజరు కానందున 12 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిప్యూటీ స్పీకర్‌కు లేఖ రాసినట్లు శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం రాత్రి ముంబైలో మీడియాతో మాట్లాడారు.

అనర్హత వేటుకు ప్రతిపాదించిన శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో.. ఏకనాథ్ షిండే, ప్రకాష్ సర్వే, తానాజీ సావంత్, మహేశ్ షిండే, అబ్దుల్ సత్తార్, సందీప్ భూమారే, భరత్ గోగావాలే, సంజయ్ శిర్సత్, యామినీ యాదవ్, అనిల్ బాబర్, బాలాజీ దేవదాస్, లతా చౌదరి ఉన్నారు. కాగా.. అనర్హత వేటుకు సంబంధించి మరికొందరి పేర్లను సైతం పరిశీలిస్తున్నట్లు సమాచారం..

ఇవి కూడా చదవండి

పార్టీ నాయకుడిగా నియమించండి.. ఏక్‌నాథ్ షిండే లేఖ..

కాగా.. శివసేన లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా తన నియామకాన్ని పునరుద్ఘాటించడంతోపాటు పార్టీ చీఫ్ విప్‌గా భరత్‌షేత్ గోగావాలేను నియమించడంపై రెబల్ శివసేన నాయకుడు ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో 37 మంది శివసేన ఎమ్మెల్యేల సంతకాలు ఉన్నాయి. ఈ లేఖను డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్, గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, శాసనమండలి కార్యదర్శి రాజేంద్ర భగవత్‌లకు పంపారు.

కాగా.. శివసేన నుంచి ఒక్కొక్కరుగా షిండే రెబల్‌ గూటికి చేరుతున్నారు. ఇప్పటికే 37 మంది ఎమ్మెల్యేలు గువాహటిలోని రాడిసన్ బ్లూ హోటల్‌కు చేరుకోగా.. తాజాగా మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు శిబిరానికి వెళ్లారు. దీంతో ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde)తో కలుపుకొని మొత్తం రెబల్‌ ఎమ్మెల్యేల సంఖ్య 39కి చేరింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
వృద్ధాప్యాన్ని దూరం చేసే పండ్లు, కూరగాయలు..! వీటితో నిత్య యవ్వనం
వృద్ధాప్యాన్ని దూరం చేసే పండ్లు, కూరగాయలు..! వీటితో నిత్య యవ్వనం
అసలేంటీ ఆఫీస్ పికాకింగ్.. దీని ఉద్దేశం ఏంటి.?
అసలేంటీ ఆఫీస్ పికాకింగ్.. దీని ఉద్దేశం ఏంటి.?
పైన పటారం చూసి పూటకూళ్ల ఇల్లు అనుకునేరు.. లోపలకెళ్లి చూడగా.!
పైన పటారం చూసి పూటకూళ్ల ఇల్లు అనుకునేరు.. లోపలకెళ్లి చూడగా.!
నాగార్జున సినిమాకు ఆ స్టార్ హీరో అసిస్టెంట్ డైరెక్టర్..
నాగార్జున సినిమాకు ఆ స్టార్ హీరో అసిస్టెంట్ డైరెక్టర్..
ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ వేసేదీ ఎప్పుడంటే?
ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ వేసేదీ ఎప్పుడంటే?
డీహైడ్రేట్ బారిన పడుతున్నారా డైట్‌లో ఈ జ్యుసి పండ్లను చేర్చుకోండి
డీహైడ్రేట్ బారిన పడుతున్నారా డైట్‌లో ఈ జ్యుసి పండ్లను చేర్చుకోండి
అందం ఆ బ్రహ్మ వరం పొంది.. ఈ వయ్యారి రూపంలో మానవ జన్మ తీసుకుందోమో.
అందం ఆ బ్రహ్మ వరం పొంది.. ఈ వయ్యారి రూపంలో మానవ జన్మ తీసుకుందోమో.
ఏటీఎమ్‌లో మీ కార్డు ఇరుక్కుపోయిందా.? జాగ్రత్త, అది పెద్ద మోసం
ఏటీఎమ్‌లో మీ కార్డు ఇరుక్కుపోయిందా.? జాగ్రత్త, అది పెద్ద మోసం
కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్‌ కాదనుకున్నారు..! సన్యాసం స్వీకరించి
కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్‌ కాదనుకున్నారు..! సన్యాసం స్వీకరించి
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..