AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dharmendra Pradhan: సమానత్వం, సమగ్రతకు జేఎన్‌యూ నిదర్శనం.. స్నాతకోత్సవంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

దేశ రాజధానిలోని ప్రతిష్ఠాత్మక జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(JNU) ఆరో స్నాతకోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇవాళ (మార్చి10)న జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు.

Dharmendra Pradhan: సమానత్వం, సమగ్రతకు జేఎన్‌యూ నిదర్శనం.. స్నాతకోత్సవంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌
Dharmendra Pradhan
Basha Shek
|

Updated on: Mar 10, 2023 | 8:55 PM

Share

దేశ రాజధానిలోని ప్రతిష్ఠాత్మక జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(JNU) ఆరో స్నాతకోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇవాళ (మార్చి10)న జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. ఈ సందర్భంగా మొత్తం 948 మంది విద్యార్థులు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్‌డీ) పట్టాలను అందుకున్నారు. ఇదే కార్యక్రమానికి గౌరవ అతిథిగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరై కీలకోపన్యాసం చేశారు. ‘భారతదేశంలో 2200 ఏళ్ల క్రితమే ప్రజాస్వామ్యం ఉందన్న కేంద్రమంత్రి భారత ప్రజాస్వామ్య మూలాలపై పరిశోధన చేయాలని జేఎన్‌యూ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ‘ ప్రపంచంలో బహుళ వైవిధ్యమున్న విశ్వవిద్యాలయాల్లో జేఎన్‌యూ ఒకటి. భారతదేశం పురాతన నాగరికత, సాంస్కృతిక వారసత్వాన్ని జేఎన్‌యూ ముందుకు తీసుకెళుతోంది. జేఎన్‌యూ అంటేనే వైవిధ్యం, సున్నితత్వం, సమగ్రత, సమానత్వం. ఇక్కడ చదువుకుని ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ సామాజిక జీవితంలో ముఖ్య పాత్రలు పోషించాలి. జేఎన్‌యూ అనేది ఒక విద్యాసంస్థ మాత్రమే కాదు ఒక సంస్కృతి. ఇక భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని అంటుంటారు చాలామంది. కానీ ప్రజాస్వామ్యానికి మన దేశం తల్లిలాంటిదని నా అభిప్రాయం. దేశంలోని 130 కోట్ల మంది భారతీయులకు జేఎన్‌యూ విద్యార్థులపై నమ్మకం, గౌరవముంది’

అన్ని రకాల నేపథ్యాల విద్యార్థులు రాణించడానికి సమాన అవకాశం కల్పించడానికి జేఎన్‌యూ ఒక ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. జేఎన్‌యూ విద్యార్థులు ప్రపంచ పౌరులుగా మారబోతున్నారు. ఇక్కడి సీనియర్లు, టీచర్లు, సిబ్బంది ఇలా అందరూ విద్యార్థుల ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తారు’ అని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు. కాగా ఇదే కార్యక్రమంలో మాట్లాడిన రాష్ట్రపతి ముర్ము మహిళా సాధికారతపై ఆసక్తికర వ్యా్‌ఖ్యలు చేశారు. ఈసారి ఇన్‌స్టిట్యూట్‌లో పురుషుల కంటే అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉందని, ఇది సామాజిక మార్పుకు ముఖ్యమైన సూచికగా ఆమె పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్