AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో ‌తొలి కరోనా పేషెంట్‌కు మళ్లీ సోకిన వైరస్.. కేరళ వైద్య విద్యార్థినికి రెండోసారి పాజిటివ్

దేశంలో గత ఏడాది కరోనా మహమ్మారి బారినపడిన తొలి పేషెంట్‌కు మళ్ళీ కరోనా సోకింది. కేరళకు చెందిన వైద్య విద్యార్థిని దేశంలో నమోదైన తొలి కరోనా కేసు కావడం తెలిసిందే.

దేశంలో ‌తొలి కరోనా పేషెంట్‌కు మళ్లీ సోకిన వైరస్.. కేరళ వైద్య విద్యార్థినికి రెండోసారి పాజిటివ్
Coronavirus
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 13, 2021 | 4:34 PM

Share

Covid-19 India: దేశంలో గత ఏడాది కరోనా మహమ్మారి బారినపడిన తొలి పేషెంట్‌కు మళ్ళీ కరోనా సోకింది. కేరళకు చెందిన వైద్య విద్యార్థిని దేశంలో నమోదైన తొలి కరోనా కేసు కావడం తెలిసిందే. త్రిసూర్‌ కు చెందిన 20 ఏళ్ల ఆ  వైద్య విద్యార్ధిని చైనాలోని ఉహాన్‌లో ఓ మెడికల్‌ యూనివర్సిటీలో చదువుకునేవారు. జనవరి, 2020లో సెలవుల నిమిత్తం ఆ విద్యార్థిని స్వదేశానికి వచ్చారు. ఆ విద్యార్ధినికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇదే దేశంలో నమోదైన తొలి కరోనా కేసు. కరోనా పురిటి గడ్డ వుహాన్‌లోనే చదువుకుంటున్న రోజుల్లోనే ఆమెకు కరోనా వైరస్ సోకింది. ఇక్కడ నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు కోవిడ్ సోకినట్లు నిర్థారణ అయ్యింది.  ఆ వైద్య విద్యార్థిని జనవరి 27 నుంచి ఫిబ్రవరి 20 వరకు 24 రోజుల పాటు త్రిసూర్‌లోని ఆసుప్రతిలో క్వారెంటైన్‌లో ఉన్నారు. మూడు వారాల తర్వాత కరోనా బారి నుంచి ఆ విద్యార్ధిని కోరుకున్నారు.

తాజాగా ఢిల్లీకి వెళ్లేందుకు సిద్దమౌతుండగా ఆ విద్యార్థిని మరోసారి కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకున్నారు. తాజా పరీక్షల్లో ఆమెకు మరోసారి కరోనా పాజిటివ్‌గా వైద్యులు గుర్తించారు. యాంటీ జెన్‌ టెస్ట్ లో పాజిటివ్‌గా వచ్చిందని త్రిసూర్‌ జిల్లా మెడికల్‌ అధికారి డాక్టర్‌ కేజీ రీనా తెలిపారు. అయితే ఆమెకు ఎలాంటి పాజిటివ్‌ లక్షణాలు కనిపించలేదని ఆరోగ్య అధికారులు వెల్లడించారు. కోవిడ్‌ టెస్ట్ లో పాజిటివ్ గా తేలటంతో మళ్ళీ క్వారంటైన్‌లో ఉన్నారు. ఆ వైద్య విద్యార్ధిని ఇప్పటి వరకు ఒక్క డోస్ కరోనా వ్యాక్సిన్ కూడా తీసుకోలేదని తెలుస్తోంది.  ప్రసుత్తం ఆ విద్యార్ధిని ఆరరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Also Read..

ఫేక్ లెటర్‌తో తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులు.. ఐదుగురిపై పోలీసుల కేసు నమోదు

గుడ్‌న్యూస్‌.. కరోనా రాకుండా రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు ఫిష్‌ బిస్కెట్లు ..!

Follow Us
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి