AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Currency History: భారత కరెన్సీ హిస్టరీ మీకు తెలుసా? గాంధీ ఫోటోకి ముందు నోట్లపై ఏ చిహ్నాలు ఉండేవో తెలుసా?

భారతదేశంలో రాజుల పాలన నుంచి స్వాతంత్యం అనంతరం వరకు కాలానుగుణంగా కరన్సీలో అనేక మార్పులు వచ్చాయి. వస్తు మార్పిడి విధానం మొదలు..

Indian Currency History: భారత కరెన్సీ హిస్టరీ మీకు తెలుసా? గాంధీ ఫోటోకి ముందు నోట్లపై ఏ చిహ్నాలు ఉండేవో తెలుసా?
Indian Currency History
Shiva Prajapati
|

Updated on: Oct 27, 2022 | 8:26 AM

Share

భారతదేశంలో రాజుల పాలన నుంచి స్వాతంత్యం అనంతరం వరకు కాలానుగుణంగా కరన్సీలో అనేక మార్పులు వచ్చాయి. వస్తు మార్పిడి విధానం మొదలు.. కరెన్సీ వినియోగం వరకు దశల వారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. నాటి బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం 1930లో చేసిన చట్టం ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ను ఏర్పాటు చేసింది. నాటి నుంచి నేటి వరకు ఆర్‌బిఐ విడుదల చేసే కరెన్సీ నోట్లే దేశంలో ద్రవ్య రూపంలో చెలామణి అవుతుంది. అయితే, రాజుల కాణంలో నాణెలపై రాజుల ముఖ చిత్రాలు, ఇతర గుర్తులు ముద్రించినట్లే.. నేటి కరెన్సీపైనా ప్రముఖుల చిత్రాలు, ప్రముఖ ప్లేస్‌ల చిత్రాలను ముద్రించడం జరుగుతుంది.

అయితే, తాజాగా భారత కరెన్సీ మార్పునకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన డిమాండ్.. ఇప్పుడు కరెన్సీపై చర్చకు దారి తీసింది. కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మతో పాటు గణేషుడు, లక్ష్మీ దేవిల చిత్రాలను కూడా ముద్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేజ్రీవాల్. దేవుళ్లు, దేవతల ఆశీస్సులు ఉంటేనే భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని కేజ్రీవాల్ అన్నారు. అయితే, ఇలాంటి డిమాండ్ మొదటిసారి వచ్చిందేం కాదు. మరి కేజ్రీవాల్‌ డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

ఇంతకు ముందు కూడా చాలా డిమాండ్స్..

గతంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలోని జాతీయ సలహా మండలి సభ్యుడిగా ఉన్న నరేంద్ర జాదవ్ కూడా భారత కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీతో పాటు రాజ్యాంగ నిర్మాతలు బీఆర్ అంబేద్కర్, స్వామి వివేకానంద చిత్రాలను ముద్రించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో, నేతాజీ సుభాష్ చంద్రబోస్ బంధువులు కూడా కొత్త నోట్లపై నేతాజీ చిత్రాన్ని ముద్రించాలని చాలాసార్లు డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఇక బీజేపీ కూడా ఓ డిమాండ్ చేసింది. కొత్త వెయ్యి రూపాయల నోటుపై మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చిత్రాన్ని ఉంచాలని మహారాష్ట్ర బీజేపీ నేత అర్జున్ గుప్తా డిమాండ్ చేశారు. కొన్ని కొత్త నోట్లపై రవీంద్రనాథ్ ఠాగూర్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చిత్రాలను ముద్రిస్తారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే, ఆ వార్తలన్నింటినీ ఆర్‌బీఐ కొట్టిపారేసింది.

స్వాతంత్ర్యానికి ముందు భారత రూపాయి..

స్వాతంత్ర్యానికి ముందు కూడా ఆర్‌బీఐ భారత కరెన్సీని ముద్రించేది. 1938లో తొలిసారిగా బ్రిటన్ రాజు 6వ జార్జ్ ఫోటోతో కూడిన 5 రూపాయల నోటును ఆర్‌బిఐ విడుదల చేసింది. ఆ తర్వాత 10 రూపాయల నోట్లు, 100 రూపాయల నుండి 1,000 రూపాయల వరకు విడుదల చేసింది. ఆ తరువాత 10,000 రూపాయల వరకు నోట్లను విడుదల చేశారు. బ్రిటిష్ కాలంలో విడుదలైన ఈ నోట్లన్నీ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కొంత కాలం వరకు చలామణిలో ఉన్నాయి.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత డిజైన్‌లో మార్పులు..

బ్రిటీష్ వారి నుండి స్వాతంత్ర్యం పొందిన తరువాత భారత రూపాయి పునఃరూపకల్పన చేయబడింది. 1949లో కరెన్సీలో ఫోటోను మార్చడం ద్వారా ఆర్‌బీఐ పెను మార్పునకు శ్రీకారం చుట్టింది. భారత కరెన్సీపై బ్రిటీష్ రాజు జార్జ్ VI ఫోటోను RBI తొలగించి. ఆ స్థానంలో జాతీయ చిహ్నమైన అశోక స్తంభాన్ని ముద్రించారు.

స్వాతంత్ర్యానంతరం 1950లో భారత రూపాయి 2, 5, 10, 100 రూపాయల నోట్ల రంగు, డిజైన్‌లో స్వల్ప మార్పులు చేయడం జరిగింది. ఇక 1954లో, తంజావూరు ఫోటోతో 1,000 రూపాయల నోటు, గేట్‌వే ఆఫ్ ఇండియా ఫోటోతో రూ. 5,000 వేలు నోటు, అశోక స్తంభం ఫోటోతో రూ. 10,000 నోటు విడుదలైంది. 1978లో ప్రభుత్వ పెద్ద నోట్లను రద్దు చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!