Independence Day: గోవా ఆగస్టు 15న కాకుండా డిసెంబర్ 19న స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటుంది?
దేశం మొత్తం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది.. ఈ రోజును గోవాలో కూడా స్వాతంత్య దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే గోవాకు.. అసలు స్వాతంత్ర్య దినోత్సవ వేడుక తేదీ డిసెంబర్ 19. ఈ రోజుని గోవా ముక్తి దివస్గా జరుపుకుంటారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 14 సంవత్సరాల తర్వాత గోవా స్వతంత్రమైంది. ఇలా ఎందుకు జరిగిందో తెలుసా..

ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారతీయులు స్వాతంత్ర్య వేడుకలను జరుపుకోవడంలో నిమగ్నమై ఉంటారు. ఈ రోజు గోవాకు కూడా ఉత్సాహభరితమైన రోజు, అయితే గోవా రాష్ట్రానికి ఆగష్టు 15న స్వాతంత్ర్యం రాలేదు. దీనికి ఒక చారిత్రక కారణం ఉంది. బ్రిటిష్ వారు దేశం విడిచి వెళ్లి స్వాతంత్ర్యం పొందిన వేడుకను భారతీయులు స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటారు, అయితే గోవా 1510 నుంచి పోర్చుగీస్ వారి ఆధ్వర్యంలో ఒక కాలనీగా ఉంది. బ్రిటిష్ వారు భారతదేశంలో అడుగుపెట్టి దేశం విడిచి వెళ్ళిన తర్వాత కూడా.. పోర్చుగీస్ వారు గోవాని పాలించారు. భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత కూడా.. పోర్చుగీస్ వారు గోవా నుంచి వెళ్ళడానికి… తమ అధికారాన్ని వదులుకోవడానికి నిరాకరించారు. ఈ కారణంగానే 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి గోవా తప్ప భారతదేశంలోని అన్ని ప్రాంతాలు బ్రిటిష్ వారి నుంచి స్వేచ్ఛ పొందాయి. అయితే గోవాకు ఎప్పుడు, ఎలా స్వాతంత్ర్యం వచ్చిందో తెలుసుకుందాం.
గోవాకు స్వాతంత్ర్యం రావడానికి 14 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే 19 డిసెంబర్ 1961 వరకు గోవా వలస పాలనలో ఉంది. అంటే భారతదేశం బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం పొందిన 14 సంవత్సరాల తర్వాత ఇది స్వతంత్రమైంది. 1510 నుంచి గోవా పోర్చుగీస్ కాలనీగా ఉంది. 1600లో బ్రిటిష్ వారు భారతదేశంలో అడుగు పెట్టడానికి చాలా కాలం ముందు. బ్రిటిష్ వారు వెళ్ళిపోయి భారతదేశం సార్వభౌమ రాజ్యంగా మారిన చాలా కాలం తర్వాత కూడా పోర్చుగీస్ గోవాని అప్పగించడానికి నిరాకరించింది.
19వ శతాబ్దంలో తిరుగుబాటు స్వరాన్ని వినిపించింది. అయితే దే శవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమం లాగా గోవా విముక్తి ఉద్యమం.. రాష్ట్రాన్ని ఏలుతున్న యూరోపియన్ శక్తులను తరిమికొట్టడానికి ఐక్యంగా ఉండలేకపోయింది. అప్పటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో జరిగిన అనేక విఫల చర్చల తర్వాత.. భారతదేశం గోవాను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో అనుసంధానించాలని, దశాబ్దాలుగా ఇక్కడ కొనసాగుతున్న పోర్చుగీస్ పాలనను ముగించాలని నిర్ణయించుకుంది.
ఇక్కడ పోర్చుగీస్ పాలనను అంతం చేయడానికి సైనిక జోక్యం చాలా అవసరమని నిర్ణయించారు. డిసెంబర్ 18, 1961న భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం సంయుక్తంగా సాయుధ చర్య తీసుకున్నాయి. దీనికి ‘ఆపరేషన్ విజయ్’ అని పేరు పెట్టారు.
మొత్తం ఆపరేషన్ సమయంలో గోవాలో కేవలం 3,300 మంది పోర్చుగీస్ సైనికులు మాత్రమే ఉన్నారు. పోర్చుగీస్ భారతదేశానికి తలవంచాల్సి వచ్చింది. పదవీచ్యుతుడైన గవర్నర్ జనరల్ మాన్యుయేల్ ఆంటోనియో వస్సలో-ఇ సిల్వా లొంగిపోయారు. డిసెంబర్ 18న సాయంత్రం 6 గంటలకు.. సచివాలయం ముందు ఉన్న పోర్చుగీస్ జెండాలను తొలగించి.. లొంగిపోతున్నట్లు సూచించడానికి తెల్ల జెండాను ఎగురవేశారు.
భారత త్రివర్ణ పతాకాన్ని ఎప్పుడు ఎగురవేశారంటే డిసెంబర్ 19 ఉదయం మేజర్ జనరల్ కాండెత్ సచివాలయం ముందు భారత జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ ఆపరేషన్లో ఏడుగురు ధైర్యవంతులైన యువ నావికాదళ సిబ్బంది, ఇతర భారతీయ సిబ్బంది అమరులయ్యారు. అప్పటి నుంచి డిసెంబర్ 19 వ తేదీని గోవా విముక్తి దినోత్సవంగా జరుపుకుంటారు.
భారత నావికాదళ అధికారిక వెబ్సైట్ ప్రకారం.. “భారత నావికాదళ నౌక గోమంతక్లోని యుద్ధ స్మారక చిహ్నాన్ని డిసెంబర్ 19, 1961న భారత నావికాదళం.. “ఆపరేషన్ విజయ్”లో ప్రాణాలను త్యాగం చేసిన ఏడుగురు యువ ధైర్య నావికులు, ఇతర సిబ్బంది జ్ఞాపకార్థం నిర్మించారు.” డిసెంబర్ 19వ తేదీ గోవా విముక్తి దినోత్సవం.. ఈ రోజుకి గోవా రాష్ట్రంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది. గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








