ప్రతివారి రక్షణకై ప్రార్థిస్తా.. విశాఖ ఘటనపై మోదీ
విశాఖపట్నంలో ఓ కెమికల్ ప్లాంట్ నుంచి విషవాయువు లీకైన ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రమ వ్యక్తం చేశారు. దీనిపై తాము హోం మంత్రిత్వ శాఖతోను, డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీతోను మాట్లాడామని ఆయన తెలిపారు..
విశాఖపట్నంలో ఓ కెమికల్ ప్లాంట్ నుంచి విషవాయువు లీకైన ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రమ వ్యక్తం చేశారు. దీనిపై తాము హోం మంత్రిత్వ శాఖతోను, డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీతోను మాట్లాడామని ఆయన తెలిపారు. ఆ ఘటనకు సంబంధించి ప్రతివారి రక్షణకూ తాను ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయన ఈ ట్వీట్లు చేసిన వెంటనే ప్రధానమంత్రి కార్యాలయం కూడా డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ సమావేశాన్ని యుధ్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. విశాఖ ఘటనలో ఓ చిన్నారి సహా ఎనిమిది మంది మృతి చెందగా సుమారు రెండు వందలమంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.