AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యతో గొడవ.. అలిగి బావిలో దూకేసిన భర్త! అతణ్ణి కాపాడబోయి మరో నలుగురు మృతి

భార్యభర్తల గొడవ ఐదుగురి ప్రాణాలను బలి తీసుకుంది. భార్యపై కోపంతో భర్త బావిలో దూకగా.. అతడిని కాపాదేందుకు స్థానికులు ఒకరి తర్వాత ఒకరుగా నలుగురు వ్యక్తులు బావిలోకి దిగారు. అయితే ఆ బావిలో దిగిన వారెవ్వరూ మళ్లీ తిరిగి బయటకు రాలేదు. మొత్తం ఐదుగురు వ్యక్తులు బావిలో దుర్హరణం చెందారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది..

భార్యతో గొడవ.. అలిగి బావిలో దూకేసిన భర్త! అతణ్ణి కాపాడబోయి మరో నలుగురు మృతి
Domestic Dispute
Srilakshmi C
|

Updated on: Jan 02, 2025 | 10:25 AM

Share

హజారీబాగ్‌, జనవరి 2: కొత్త ఏడాది రోజున ఓ జంట కీచులాడుకున్నారు. అదికాస్తా చిరిగి చిరిగా గాలివానగా మారింది. దీంతో భార్యపై ఆగ్రహంతో అలిగిన భర్త వెంటనే పెరట్లోని బావిలో దూకేశాడు. గమనించిన ఇరుగు పొరుగు అతడిని కాపాడబోయి ఒకరటి తర్వాత ఒకరుగా ఐదుగురు దూకేశారు. దీంతో ఐదుగురు వ్యక్తులను ఆ బావి ఒకేసారి మింగేసింది. ఈ షాకింగ్‌ ఘటన జార్ఖండ్‌లోని హజారీబాగ్‌ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం

జార్ఖంగ్‌లోని బిష్ణుగఢ్‌ సమీపంలోని చార్హి పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్వహా గ్రామంలో సుందర్‌ కుర్మలి (27) తన భార్య రూపా దేవితో జనవరి 1వ తేదీన (బుధవారం) ఇంట్లో ఘర్షణ పడ్డారు. కోపోద్రిక్తుడైన సుందర్‌ తన బైక్‌ను వేగంగా నడుపుకుంటూ బైక్‌ను బావిలోకి తోసేశాడు. కాసేపటి తర్వాత బైక్‌ను తీసేందుకు బావిలోకి దిగాడు. కానీ అతను ఎంతకూ తిరిగి రాలేదు. భయాందోళనలకు గురైన భార్య రుపా తన భర్తను రక్షించాలంటూ కేకలు వేసింది. గమనించిన ఇరుగు పొరుగు సుందర్‌ను కాపాడటం కోసం ఒకరి తర్వాత మరొకరు నలుగురు బావిలో దిగారు. సుందర్‌తోపాటు ఆ నలుగురు కూడా తిరిగిరాలేదు. ఈ ఐదుగురు బావిలోనే ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిని రాహుల్ కర్మాలి, వినయ్ కర్మాలి, పంకజ్ కర్మాలి, సూరజ్ భుయాన్‌గా పోలీసులు గుర్తించారు. మృతులందరూ 25 నుంచి 28 యేళ్లలోపువారే.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు ఎస్‌డీపీఓ తెలిపారు. ఐదుగురిని మింగేసిన బావి సమీపంలోకి వెళ్లేందుకు కూడా స్థానికులు జంకుతున్నారు. బాధితులు విషవాయువు పీల్చడం వల్లే మరణించి ఉంటారని చార్హి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అధికారి గౌతమ్ కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. మరణాలకు ఖచ్చితమైన కారణం దర్యాప్తులో తేలుతుందని ఆయన తెలిపారు. దీంతో ఆ బావిని మూసివేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

బాయిలోనే బల్లిపలికే ఫోక్ సాంగ్‌కు ఎన్ని లక్షలు వచ్చాయంటే..
బాయిలోనే బల్లిపలికే ఫోక్ సాంగ్‌కు ఎన్ని లక్షలు వచ్చాయంటే..
అప్పుడు సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. శ్రీకాంత్
అప్పుడు సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. శ్రీకాంత్
ఏం రాత రాశావు దేవుడా.. మంటల్లో పిల్లలు.. తట్టుకోలేక భార్య..
ఏం రాత రాశావు దేవుడా.. మంటల్లో పిల్లలు.. తట్టుకోలేక భార్య..
బన్నీ సినిమాలో కొంచెం ఉంటే బూతు పాట అయిపోయేది..
బన్నీ సినిమాలో కొంచెం ఉంటే బూతు పాట అయిపోయేది..
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి