AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: గురుకుల విద్యాలయాల్లో మృత్యుఘోష.. ఖమ్మంలో మరో ఇద్దరు విద్యార్ధులు ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల విద్యాలయాలు విద్యార్ధుల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నాయి. ఇప్పటికే పలువురు విద్యార్ధుల ప్రాణాల్లోగాల్లోకలిసిపోగా.. తాజా మరో ఇద్దరు విద్యార్ధులు మరణించారు. ఖమ్మం జిల్లాలోని వేర్వేరు గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ఇద్దరు విద్యార్ధులు ఆత్మహత్య చేసుకుని మరణించడం కలకలం రేపుతుంది..

Telangana: గురుకుల విద్యాలయాల్లో మృత్యుఘోష.. ఖమ్మంలో మరో ఇద్దరు విద్యార్ధులు ఆత్మహత్య
Gurukula Students
Srilakshmi C
|

Updated on: Jan 01, 2025 | 11:28 AM

Share

ఖమ్మం, జనవరి 1: తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో మరణమృదంగం మోగుతోంది. ఇప్పటికే పలువురు విద్యార్ధులు పాముకాట్లు, కలుషిత ఆహారం వల్ల బలైతే.. తాజాగా మరో ఇద్దరు విద్యార్ధులు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. ఒకరు కళాశాలలోనే ఉరి వేసుకోగా, మరోచోట ఎలుకల మందుతాగి ప్రాణాలు విడిచాడు. ఖమ్మం జిల్లాలో వేరువేరు గరుకులాల్లో ఈ దారుణ సంఘటనలు చోటు చేసుకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన మాడుగుల సాయివర్ధన్‌ (17) మధిర మండలం కృష్ణాపురం సోషల్‌ వెల్ఫేర్‌ బాలుర జూనియర్‌ కళాశాలలో ఎంపీసీ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నాడు. క్రిస్మస్‌ సెలవులకు ఇంటికి వెళ్లిన సాయివర్ధన్‌.. సోమవారం మధ్యాహ్నం హాస్టల్‌కు వచ్చాడు. తోటి విద్యార్థులతో రాత్రి 10 గంటల వరకు కలిసే ఉన్నాడు. అర్ధరాత్రి సమయంలో అందరూ నిద్రపోయిన తర్వాత హాస్టల్‌ పైఅంతస్తులోకి వెళ్లి చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం తెల్లవారుజామున హాస్టల్‌ సిబ్బంది గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

ఎలుకల మందు తాగి చింతగుర్తి గరుకుల విద్యార్ధి ఆత్మహత్య

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చింతగుర్తికి చెందిన కుక్కల భార్గవ్‌ (17) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఎస్సీ గురుకుల కళాశాలలో ఇంటర్‌ సెకండ్ ఇయర్‌ చదువుతున్నాడు. క్రిస్మస్‌ సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చిన భార్గవ్‌ను తిరిగి హాస్టల్‌కు వెళ్లాలని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన భార్గవ్‌ డిసెంబర్‌ 27న ఇంట్లో ఉన్న ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులు గమనించి వెంటనే దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. గురుకుల విద్యార్ధుల వరుస మరణాలపై ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, డీవైఎఫ్‌ఐ, ఎంఎస్‌ఎఫ్‌, ఏఐఎస్‌ఎఫ్‌ సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు మరణిస్తున్నారని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..