AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘోరం.. భర్తను ముక్కలు ముక్కలుగా నరికిన భార్య.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

భర్త మద్యానికి బానిసయ్యాడు.. తరచూ ఇదే విషయంపై దంపతులు ఇద్దరూ గొడవ పడేవారు.. భర్త వేధిస్తున్నాడంటూ భార్య తరచూ చెబుతుండేది.. కానీ.. ఓ రోజు భార్య దారుణ నిర్ణయం తీసుకుంది.. భర్త నిద్రిస్తున్న సమయంలో దారుణంగా చంపేసింది.. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికింది.. అనంతరం ఆ ముక్కలను తీసుకెళ్లి ఓ దగ్గర పడేయడం కలకలం రేపింది.

ఘోరం.. భర్తను ముక్కలు ముక్కలుగా నరికిన భార్య.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Jan 02, 2025 | 12:40 PM

Share

పెళ్లై ఎంతో కాలమైంది.. భార్యభర్తలిద్దరూ మొదట్లో బాగానే ఉండేవారు.. నలుగురు సంతానం.. ఆ తర్వాత భర్త మద్యానికి బానిసయ్యాడు.. తరచూ ఇదే విషయంపై దంపతులు ఇద్దరూ గొడవ పడేవారు.. భర్త వేధిస్తున్నాడంటూ భార్య తరచూ చెబుతుండేది.. ఈ క్రమంలోనే శారీరక సంబంధానికి భార్య ఒప్పుకోలేదన్న కారణంతో తన కుమార్తెపై అత్యాచారానికి యత్నించాడు.. కూతురిపై బలాత్కారం చేయడానికి ప్రయత్నించడంతో భార్య దారుణ నిర్ణయం తీసుకుంది.. భర్త నిద్రిస్తున్న సమయంలో దారుణంగా చంపేసింది.. అంతటితో ఆగకుండా.. ముక్కలు ముక్కలుగా నరికి పొలంలో పడేసింది.. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని బెలగావి జిల్లాలో చోటుచేసుకుంది. భర్తను భార్య చంపిన ఘటన గురువారం తెల్లవారుజామున బెలగావి చిక్కోటి తాలూకా ఉమారాణి గ్రామంలో జరిగింది.. భర్తను చంపిన తర్వాత.. మృతదేహాన్ని ముక్కలుగా కోసి గ్రామ శివారు పొలంలోని బావి వద్ద పడేసిందనరి పోలీసులు తెలిపారు. ఈ ఘటన సంచలనంగా మారింది..

పోలీసుల కథనం ప్రకారం.. చొక్కోటి ప్రాంతంలోని ఉమారాణి గ్రామానికి చెందిన శ్రీమంత హిట్నల్, సావిత్రి భార్యాభర్తలు.. వారికి నలుగురు సంతానం ఉన్నారు.. కొంతకాలం వరకు ఇద్దరూ బాగానే ఉన్నారు.. ఆ తర్వాత మద్యానికి బానిసయ్యాడు.. అయితే.. భర్త ఏ పని చేయకుండా నిత్యం మద్యం తాగుతుండటంతో భార్య.. వద్దని వారించేది.. ఈ విషయం మీద దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భర్త.. ఫుల్లుగా తాగొచ్చి భార్యతో గొడవపడ్డాడు. భర్త.. శారీరక సంబంధానికి  ప్రయత్నించడంతో భార్య వద్దని వారించింది.. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంతటితో ఆగకుండా భర్త కూతురిపై బలాత్కారం చేయబోవడంతో.. భార్య భర్తపై కోపంతో రగిలిపోయింది.. రాత్రి భర్త నిద్రిస్తున్న సమయంలో భార్య.. భర్త తలపై బండరాయితో మోది హతమార్చింది. ఆపై మృతదేహం కనిపించకుండా చేయడానికి రెండు ముక్కలుగా నరికింది.. అనంతరం బకెట్ లాంటి పాత్రలో ఉంచి .. గ్రామ శివారుకు తీసుకెళ్లి పొలం దగ్గర పడేసింది..

అనంతరం ఇంటికి చేరుకుని రక్తపు మరకలు కనిపించకుండా శుభ్రం చేసింది..భర్త దుస్తులతోనే రక్తపు మరకలు శుభ్రం చేసి.. వాటిని కూడా మాయం చేసింది.. దుస్తులను కాల్చింది.

అయితే.. ముక్కలుగా ఉన్న శ్రీమంత్ మృతదేహం చూసి.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వివరాలు సేకరించారు.. భార్య సావిత్రినే ఈ ఘోరానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.. కాగా.. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండు స్థానాలు ఎగబాకిన గిల్
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండు స్థానాలు ఎగబాకిన గిల్