AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అజ్ఞానం.. రాజకీయ అవకాశవాదం…’ ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్ట్రాంగ్ కౌంటర్!

దేశంలో అమలవుతున్న విద్యా వ్యవస్థపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తన సిద్ధాంతాల ప్రకారం పిల్లలను బ్రెయిన్ వాష్ చేయడానికి నూతన విద్యా విధానం,పిఎం శ్రీని ప్రవేశపెట్టిందని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక వ్యాఖ్యలను కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్రంగా ఖండించారు.

'అజ్ఞానం.. రాజకీయ అవకాశవాదం...' ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్ట్రాంగ్ కౌంటర్!
Dharmendra Pradhan Copy
Balaraju Goud
|

Updated on: Oct 30, 2025 | 10:33 PM

Share

దేశంలో అమలవుతున్న విద్యా వ్యవస్థపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తన సిద్ధాంతాల ప్రకారం పిల్లలను బ్రెయిన్ వాష్ చేయడానికి నూతన విద్యా విధానం,పిఎం శ్రీని ప్రవేశపెట్టిందని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక వ్యాఖ్యలను కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్రంగా ఖండించారు. ఆమె ప్రకటనపై ఎదురుదాడి చేస్తూ, జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి) 2020, పిఎం శ్రీ (ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా) చొరవపై ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలు ఆమె అజ్ఞానాన్ని, రాజకీయ అవకాశవాదాన్ని ప్రదర్శిస్తున్నాయని అన్నారు. ఇటువంటి బాధ్యతారహిత ప్రకటనలు చేయడం ద్వారా, ఆమె వాస్తవాలను వక్రీకరించడమే అవుతుందన్నారు. అంతేకాకుండా, ఈ చారిత్రాత్మక సంస్కరణలను రూపొందించిన దేశ ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, పౌరుల సమిష్టి జ్ఞానాన్ని కూడా అవమానిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

21వ శతాబ్దపు సవాళ్లకు యువతను సిద్ధం చేసే అర్థవంతమైన విద్యా సంస్కరణల కోసం దేశం 30 సంవత్సరాలుగా ఎదురుచూస్తోందని కేంద్ర మంత్రి అన్నారు. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త దివంగత కె. కస్తూరిరంగన్ మార్గదర్శకత్వంలో రూపొందించిన NEP-2020, ఇప్పటివరకు నిర్వహించిన అత్యంత విస్తృతమైన, సమగ్ర సంప్రదింపుల ప్రక్రియలలో ఒకటి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు, సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. ఈ విధానం దేశ నాగరికత తత్వాలలో దృఢంగా పాతుకుపోయి, సమ్మిళితత్వం, సమానత్వం, నాణ్యమైన విద్య, ప్రపంచ పోటీతత్వాన్ని చాటి చెప్పడం ద్వారా విద్యా వ్యవస్థను ఆధునీకరించడానికి ప్రయత్నిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు.

ఈ దార్శనికతకు పీఎం శ్రీ స్కూల్స్ సజీవ నిదర్శనాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ఈ మోడల్ స్కూల్స్ స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, అటల్ టింకరింగ్, ఇన్నోవేషన్ ల్యాబ్‌లు, డిజిటల్, అనుభవపూర్వక అభ్యాసం, లైబ్రరీలు, పర్యావరణ అనుకూల క్యాంపస్‌లు, వృత్తి, నైపుణ్య కేంద్రాలు, ప్రతి బిడ్డకు సమగ్ర స్థలాలతో భారతీయ విద్య భవిష్యత్తును సూచిస్తాయి. ఈ పాఠశాలలు కళలు, సంస్కృతి, క్రీడలు, పర్యావరణ పరిరక్షణను చురుకుగా ప్రోత్సహిస్తాయి. పీఎం శ్రీ స్కూల్స్ ఆధునికతను నైతిక బలంతో, సాంకేతికతను సంప్రదాయంతో ఆవిష్కరణను సమగ్రతతో మిళితం చేస్తాయని కేంద్ర మంత్రి అన్నారు.

ఇటువంటి అదర్శవంత సంస్కరణలను వ్యతిరేకించడం అంటే ఆ విధానాన్ని విమర్శించడం కాదు, బదులుగా మన పిల్లలకు విద్యను అందించడానికి పాత రాజకీయ రాజవంశాల ఆమోదం ఇకపై అవసరం లేదు అనే ఆలోచనకు వ్యతిరేకంగా నిరసన అని కేంద్ర మంత్రి అన్నారు. దశాబ్దాలుగా విద్య రాజకీయ వాక్చాతుర్యం, నిర్లక్ష్యం వరకే పరిమితం కావడం వల్ల బహుశా ఈ అసంతృప్తి తలెత్తి ఉండవచ్చు. ఇప్పుడు సంస్కరణలు వాస్తవానికి అమలు చేయడం జరుగుంది. కొంతమంది విజయాన్ని అంగీకరించడం కంటే ఆగ్రహం వ్యక్తం చేయడంపై ఎక్కువ శ్రద్ధ అని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎద్దేవా చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..