AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP: 2024 ఎన్నికలే టార్గెట్.. పార్లమెంటరీ బోర్డు, ఎన్నికల కమిటీలను ప్రకటించిన బీజేపీ.. ఆ ఇద్దరు సీనియర్లు ఔట్..

11 మందితో పార్లమెంటరీ కొత్త బోర్డు, మరో 15 మంది సభ్యులతో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీని ప్రకటించింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో మొత్తం 11 మంది నేతలకు స్థానం కల్పించగా.. ముగ్గురు కొత్త నేతలకు చోటు కల్పించారు.

BJP: 2024 ఎన్నికలే టార్గెట్.. పార్లమెంటరీ బోర్డు, ఎన్నికల కమిటీలను ప్రకటించిన బీజేపీ.. ఆ ఇద్దరు సీనియర్లు ఔట్..
Bjp
Shaik Madar Saheb
| Edited By: |

Updated on: Aug 17, 2022 | 3:43 PM

Share

BJP Parliamentary Board – CEC: భారతీయ జనతా పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల కోసం సన్నాహాలను ప్రారంభించింది. ఈ మేరకు బీజేపీ కొత్త పార్లమెంటరీ బోర్డులో ప్రక్షాళన చేసింది. దీంతోపాటు ఎన్నికల కమిటీని బుధవారం ప్రకటించింది. 11 మందితో పార్లమెంటరీ కొత్త బోర్డు, మరో 15 మంది సభ్యులతో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీని ప్రకటించింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో మొత్తం 11 మంది నేతలకు స్థానం కల్పించగా.. ముగ్గురు కొత్త నేతలకు చోటు కల్పించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లకు పార్లమెంటరీ బోర్డు నుంచి తొలగించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, సర్బానంద సోనోవాల్, తెలుగు రాష్ట్రాల నుంచి డాక్టర్‌ కే లక్షణ్‌కు అవకాశం దక్కింది.

కొత్త పార్లమెంటరీ బోర్డు.. ఇదే

ఇవి కూడా చదవండి

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ బోర్డులో ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీఎస్‌ యడియూరప్ప, సర్బానంద సోనోవాల్, కే లక్ష్మణ్‌, ఇక్బాల్ సింగ్ లాల్‌పుర, సుధా యాదవ్‌, సత్యనారాయణ జతియా , కేఎల్‌ సంతోష్‌ సభ్యులుగా ఉంటారు. జేపీ నడ్డా అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు.

బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీలో కూడా డాక్టర్‌ లక్ష్మణ్‌కు చోటు దక్కింది. ఈ కమిటీలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ , కేంద్రమంత్రి భూపేంద్రయాదవ్‌కు కూడా అవకాశం కల్పించారు. నడ్డా ఈ కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు.

బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ..

జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీఎస్‌ యడియూరప్ప, సర్బానంద సోనోవాల్, కే లక్ష్మణ్‌, ఇక్బాల్ సింగ్ లాల్‌పుర, సుధా యాదవ్‌, సత్యనారాయణ జటియా , కేఎల్‌ సంతోష్‌, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ , కేంద్రమంత్రి భూపేంద్రయాదవ్‌, ఓమ్ మథుర్‌, వనతి శ్రీనివాస్‌కు చోటు కల్పించారు.

ఇది కూడా చదవండి.. టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..

Follow Us
రెండో సూర్య గ్రహణం తర్వాత భారీ మార్పులు..
రెండో సూర్య గ్రహణం తర్వాత భారీ మార్పులు..
ఓటీటీని ఊపేస్తోన్న డార్క్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో టాప్ రేటింగ్
ఓటీటీని ఊపేస్తోన్న డార్క్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో టాప్ రేటింగ్
నల్ల తాచునే గజగజ వణికించారుగా.. ఒళ్ళు గగుర్పొడిచే వైరల్ వీడియో..!
నల్ల తాచునే గజగజ వణికించారుగా.. ఒళ్ళు గగుర్పొడిచే వైరల్ వీడియో..!
రోజు ఓ చిటికెడు తీసుకోండి.. నరాల వీక్‌నెస్‌ పాలిట రామబాణం ఇది..!
రోజు ఓ చిటికెడు తీసుకోండి.. నరాల వీక్‌నెస్‌ పాలిట రామబాణం ఇది..!
కొత్త చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..!
కొత్త చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..!
12 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..
12 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..
సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..
సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు