Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘించిన బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి.. భారీ జరిమానా విధింపు

స్వయం ప్రకటిత గాడ్‌మ్యాన్, భాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి అయిన పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రికి ట్రాఫిక్‌ పోలీసులు భారీ జరిమానా విధించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా బీహార్ పోలీసులు రూ.1,000 ఫైన్ వేశారు. పాట్నా పర్యటనలో..

ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘించిన బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి.. భారీ జరిమానా విధింపు
Dhirendra Shastri
Follow us
Srilakshmi C

|

Updated on: May 19, 2023 | 5:54 PM

స్వయం ప్రకటిత బాబా, భాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి అయిన పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రికి ట్రాఫిక్‌ పోలీసులు భారీ జరిమానా విధించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా బీహార్ పోలీసులు రూ.1,000 ఫైన్ వేశారు. పాట్నా పర్యటనలో ఉన్న ఆయన ఇటీవల సీటు బెల్డ్ లేకుండా ప్రయాణించడం ద్వారా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్టు పోలీసులు గుర్తించారు.

కాగా బాగేశ్వర్ బాబా మే 13న పాట్నాకు వచ్చారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా బాగేశ్వర్ బాబా, బీజేపీ ఎంపీ మనోజ్‌ తివారీతో కలిసి అదే రోజు ఎయిర్‌ పోర్టు నుంచి హోటల్‌కు వెళ్తున్న సమయంలో వారు సీటు బెల్టు ధరించనందుకు రూ.1,000 చలనా జారీ చేసినట్టు పాట్నా ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

సీసీటీవీ ఫుటేజ్‌ పరిశీలించిన పోలీసులు తివారీ, బాగేశ్వర్ బాబాలకు ఈ మేరకు చలానా వేసినట్లు పాట్న ట్రాఫిక్‌ పోలీస్‌ ఎస్పీ పురాన్‌ కుమార్ ఝా తెలిపారు. 90 రోజుల్లో చలానా మొత్తం చెల్లించకుండే ఆ వాహనాన్ని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాల్సిందిగా రవాణా శాఖకు ట్రాఫిక్ పోలీసులు సిఫారసు చేసే అవకాశం ఉంటుంది. పాట్నాలో పర్యటించిన బాగేశ్వర్ బాబా దర్శనార్ధం తరేత్ పాలీ మఠానికి పెద్ద సంఖ్యలో ఆయన భక్తులు తరలి రావడంతో రోడ్లపై ట్రాఫిక్ అంతరాయం తలెత్తింది. మఠానికి 25 కిలోమీటర్ల పరిధిలో మే 13 నుంచి ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.