AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: ఇక నుంచి ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్లు శంభాజీనగర్‌, ధరాశివ్‌ నగరాలు .. చరిత్ర మార్చడం సరికాదంటూ ఒవైసీ మండిపాటు

మహారాష్ట్రలోని రెండు నగరాల పేర్లను మార్చాలని ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. చరిత్ర ఎప్పుడూ  చరిత్రే..  దాన్ని ట్యాంపరింగ్ చేయడం సరికాదని ఒవైసీ అన్నారు.

Maharashtra: ఇక నుంచి ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్లు శంభాజీనగర్‌, ధరాశివ్‌ నగరాలు .. చరిత్ర మార్చడం సరికాదంటూ ఒవైసీ మండిపాటు
Asaduddin Owaisi
Surya Kala
|

Updated on: Feb 25, 2023 | 1:40 PM

Share

మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో రెండు నగరాల పేర్లను ఏక్ నాథ్ షిండే మార్చుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఏక్ నాథ్ ప్రభుత్వంపై AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ విరుచుకుపడ్డారు. తమ ప్రాంతం ఎలా ఉండాలి.. ఏ పేరుతో ఉండాలని ప్రజలే నిర్ణయిస్తారని, ఏకనాథ్, దేవేంద్ర, ఉద్ధవ్ కాదు అని ఒవైసీ అన్నారు. ఈరోజు ప్రభుత్వానికి సంఖ్యాబలం ఉంది.. కనుక ప్రజలను విశ్వాసంలోకి తీసుకోకుండా ఏ పనైనా చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఒవైసీ.

వాస్తవానికి, మహారాష్ట్రలోని ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం రాష్ట్రంలోని రెండు నగరాలైన ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్లను మార్చాలని నిర్ణయించింది. ఔరంగాబాద్ పేరు ఛత్రపతి శంభాజీనగర్‌గా, ఉస్మానాబాద్‌ పేరు ధరాశివ్‌గా మారింది. నగరాల పేర్లు మార్చడంపై ఒవైసీ మాట్లాడుతూ.. ప్రభుత్వాలు..    స్థలాలు, పార్కులు, నగరాల పేర్లను మారుస్తూనే ఉన్నారు.. ఇది సరికాదు అని చెప్పారు.

‘చరిత్రను తారుమారు చేయడం తప్పు’ ప్రభుత్వాలు స్థలాలు, పార్కులు, నగరాల పేర్లను మారుస్తూనే ఉన్నారు.. చరిత్ర మంచి కావచ్చు, చెడు కావచ్చు కానీ చరిత్ర చరిత్రే అన్నారు. దానిని తారుమారు చేయడం తప్పు. ప్రపంచంలోని వారసత్వ కట్టడాలు మన ఔరంగాబాద్‌లో ఉన్నాయని అన్నారు.  ఇప్పుడు చేసే పేర్లు మార్పు ప్రతి స్థాయిలో ప్రభావం చూపిస్తుంది.. అన్ని పత్రాలను మార్చవలసి ఉంటుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

ప్రాంతాల పేర్లు ప్రజలే నిర్ణయిస్తారు ఇంతకు ముందు మోర్చా చేపట్టామని, ప్రజలు కూడా నిరసన తెలిపారని అన్నారు. ఈరోజు ప్రభుత్వానికి సంఖ్యాబలం ఉంది, ప్రజల భావాలను  విశ్వాసంలోకి తీసుకోకుండా ఏ పనైనా చేస్తున్నారు. ఇది నియంతృత్వం పోకడ అన్నారు. ఏకనాథ్ షిండే, దేవేంద్ర లేదా ఉద్ధవ్ కాదు. పేరు మార్చుకుంటే నీళ్లు, ఉపాధి లభిస్తుందా అని ఒవైసీ ప్రశ్నించారు. కోర్టు కంటే మేమే సుప్రీమ్ అనే సందేశాన్ని ప్రభుత్వం ఇచ్చిందన్నారు ఒవైసి.

కేంద్రం గ్రీన్ సిగ్నల్  ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్లను మార్చే ప్రక్రియకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పేరు మార్పుకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. దీంతో ఇప్పుడు ఔరంగాబాద్ పేరు ఛత్రపతి శంభాజీనగర్‌గా, ఉస్మానాబాద్ పేరు ధరాశివ్‌గా మారనుంది. ఏ రాష్ట్రంలోనైనా నగరాల పేర్లు మార్చడం ఇదే మొదటిసారి కాదు.. గతంలో యూపీలోని పలు నగరాలు, రైల్వే స్టేషన్ల పేర్లను మార్చారు.

పంజాబ్‌లో ఖలిస్తానీ మద్దతుదారు అమృతపాల్ సింగ్ వివాదాస్పద ప్రకటనపై అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. ఇదే స్టేట్‌మెంట్‌ను ఒక ముస్లిం ఇచ్చి ఉంటే ఈపాటికి రచ్చ జరిగేదని అన్నారు. ప్రస్తుతం పంజాబ్‌లో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..