AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asaduddin Owaisi: మేమేం బీజేపీకి బీటీమ్ కాదు.. గుజరాత్‌ ఎన్నికల్లో పోటీచేస్తాం: ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి మెజారిటీ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు మజ్లిస్‌ ఎంపీ ఒవైసీ. బీజేపీకి తాము బీటీమ్‌ అన్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు.

Asaduddin Owaisi: మేమేం బీజేపీకి బీటీమ్ కాదు.. గుజరాత్‌ ఎన్నికల్లో పోటీచేస్తాం: ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ
AIMIM chief Asaduddin Owaisi (File Photo)
Shaik Madar Saheb
|

Updated on: May 23, 2022 | 8:00 AM

Share

Gujarat Assembly Polls: ప్రధాని మోదీ సొంతగడ్డ గుజరాత్‌లో కూడా సత్తా చాటడానికి మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ తహతహలాడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆయన తరచుగా గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. ఆదివారం సూరత్‌లో జరిగిన ఆ పార్టీ సమావేశంలో ఎంఐఎం చీఫ్ అసద్ (Asaduddin Owaisi) పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ మాట్లాడుతూ.. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్‌ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. మిత్రపక్షాలతో కలిసి మెజారిటీ స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు. బీజేపీకి బీటీమ్‌గా తమను కాంగ్రెస్‌ నేతలు విమర్శించడంపై మండిపడ్డారు ఒవైసీ. రాహుల్‌గాంధీ గత ఎన్నికల్లో పోటీ చేసిన అమేథీలో మజ్లిస్‌ అభ్యర్ధి బరిలో లేరని, అయినప్పటికీ కాంగ్రెస్ ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ద్రవ్యోల్భణం, నిరుద్యోగం లాంటి సమస్యలతో దేశం అల్లాడుతోందని అన్నారు ఒవైసీ. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్‌లో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. మైనారిటీలు, ఆదివాసీలు దుర్భరజీవితాన్ని గడుపుతున్నారని తెలిపారు. బలమైన ప్రతిపక్షం బాధ్యతల నుంచి కాంగ్రెస్‌ వైదొలగిందని మండిపడ్డారు.

జ్ఞానవాపి మసీదు లాంటి వివాదం వచ్చినప్పుడు కేంద్రం వెంటనే స్పందించాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని మోదీ ఇప్పటికైన ఈ వ్యవహారంపై స్పందించాలని కోరారు. 1991 చట్టం ప్రకారం నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. జ్ఞానవాపి మసీదు లాంటి వివాదాలు సంఘ్‌పరివార్‌ జాబితాలో చాలా ఉన్నాయన్నారు. పాత గాయాలను తవ్వే కొద్దీ దేశంలో మరిన్ని కొత్త సమస్యలు వస్తాయని హెచ్చరించారు. ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తీరును సైతం ఓవైసీ తప్పుపట్టారు. ఢిల్లీలో అల్లర్లు జరుగుతున్న వేళ కేజ్రీవాల్‌ ప్రజల్లోకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బీజేపీ అంటే భయపడే కేజ్రీవాల్‌ లాంటి నేతలు ప్రజలకు ఏం న్యాయం చేస్తారంటూ విమర్శించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
న్యూయార్క్‌లో ఆగస్టు 29న విశ్వ ఐక్యతా వేడుకలు!
న్యూయార్క్‌లో ఆగస్టు 29న విశ్వ ఐక్యతా వేడుకలు!
పిల్లలకు డయేరియా, వాంతులా? ORS తాగిస్తే నయం అవుతుందా..
పిల్లలకు డయేరియా, వాంతులా? ORS తాగిస్తే నయం అవుతుందా..
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడమే కష్టం.. హీరోయిన్ ఎమోషనల్..
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడమే కష్టం.. హీరోయిన్ ఎమోషనల్..
2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే
2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే