అమెరికాలో సడెన్ గా కుంగిన భూమి.. గుంతలో పడ్డ కార్లు
అమెరికాలోని ఒమాహాలో 67వ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రోడ్డు ఉన్నట్టుండి కుంగి భారీ గుంత ఏర్పడింది. ఆ సమయంలో ఆగిన రెండు కార్లు గుంతలో పడిపోయాయి. ప్రయాణికులకు పెద్దగా గాయాలు కాలేదు. భూగర్భ నీటి పైప్లైన్ లీకేజ్ కారణంగానే ఈ సింక్హోల్ ఏర్పడిందని ఇంజనీర్లు తెలిపారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డై, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరమ్మతులు కొనసాగుతున్నాయి.
అమెరికాలోని ఒమాహా సిటీలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రోడ్డు ఉన్నట్టుండి కుంగి భారీ గుంత ఏర్పడింది. ఆ సమయంలో రెడ్ సిగ్నల్ పడడంతో అక్కడ ఆగిన రెండు కార్లు గుంతలో పడిపోయాయి. అయితే అందులోని ప్రయాణికులకు పెద్దగా గాయాలు కాలేదు. ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీటీవీ కెమెరాలలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒమాహా సిటీలోని 67వ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో వాహనాలు ఆగుతున్న సమయంలో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయి భారీ గుంత ఏర్పడింది. ఊహించని ఈ షాకింగ్ ఘటనలో ఒక ఎస్యూవీ, మరో పికప్ ట్రక్ గుంతలో పడిపోయాయి. అత్యవసర సేవా సిబ్బంది అక్కడికి చేరుకునేలోపే, ఆ రెండు వాహనాల్లోని డ్రైవర్లను తోటి వాహనదారులు కాపాడారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. భూగర్భంలో నీటి పైపులైన్ లీక్ కావడం వల్ల లోపల మట్టి కోతకు గురై, పైన ఉన్న రోడ్డుకు పట్టు కోల్పోవడమే ఈ సింక్ హోల్ ఏర్పడటానికి కారణమని సిటీ ఇంజనీర్ ఆస్టిన్ రోజర్ తెలిపారు. గుంత మరింత విస్తరించే అవకాశం ఉన్నందున ఆ ప్రాంతానికి ఎవరూ రావద్దని పోలీసులు హెచ్చరించారు. మెట్రోపాలిటన్ యుటిలిటీస్ డిస్ట్రిక్ట్ సిబ్బంది ఘటనా స్థలంలో మరమ్మతులు చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pomegranate: ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దానిమ్మ తింటే.. అంతే సంగతులు
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు
మరో హనీమూన్ తరహా మర్డర్ లోహగడ్ కోట మృతి కేసులో సంచలన విషయాలు!
డేంజర్ జోన్లో తెలుగు రాష్ట్రాలు..జూన్ 30 వరకు వణికించనున్నవానలు
బైకు కొనివ్వలేదని అమ్మమ్మపై మనవడి ఘాతుకం
రైతుల ఇంట సిరులు కురిపిస్తున్న కచిడి చేపలు!
భద్రాచలంలో దారుణం.. మూఢనమ్మకంతో ఇంటి యజమాని ఏంచేశాడో చూడండి..!
తిరుమలలో ఘరానా మోసం.. సుప్రభాత సేవ, వసతి పేరుతో 60 మందికి టోకరా !
పిట్టగోడపై కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న యువతి .. అంతలోనే
పాస్పోర్ట్కి అప్లై చేయాలా? జులై 1 నుంచి ఫీజులు పెరుగుతున్నాయ్
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలెర్ట్ 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
ట్రోలింగ్ భయంతో.. నోరు విప్పలేకపోతున్నా.. రష్మిక ఎమోషనల్
రూ.20 కడితే.. రూ.2 లక్షల బీమా.. అయినా ఎందుకింత నిర్లక్ష్యం?

