ఇలాంటి కేసు ఎక్కడా చూసుండరూ.. రూ.6 చిల్లర ఇవ్వనందుకు.. 26 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న రైల్వే ఉద్యోగి
ముంబయి కుర్లా టెర్మినల్ జంక్షన్ వద్ద రాజేశ్ వర్మ అనే వ్యక్తి రైల్వే టికెట్ క్లర్క్గా విధులు నిర్వర్తించేవారు. అయితే 1997వ సంవత్సలో ఆగస్టు 30 వ తేదీన విజిలెన్స్ బృందం ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ను ప్యాసింజర్గా పంపి టికెట్ కొనుగోలు చేయించేలా చేశారు. అయితే ఇందులోనే రాజేష్ వర్మ అడ్డంగా బుక్కయ్యారు. అక్కడ ఏం జరిగిందంటే ఆ ప్రయాణికుడు టికెట్ క్లర్క్ అయిన రాజేష్ వర్మకు 500 రూపాయలు ఇచ్చాడు. వాస్తవానికి టికెట్ ధర 214 రూపాయలు మాత్రమే.

ముంబయిలోని ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కేవలం ఆరు రూపాయల చిల్లర ఇవ్వనందుకు ఓ రైల్వే క్లర్క్కు చుక్కలు కనబడ్డాయి. గత 26 ఏళ్లుగా అతనికి ఉపశమనం లభించలేదు. విజలిన్స్ బృందం పంపిన వ్యక్తికి చిల్లర ఇవ్వకపోవడం వల్ల అతడు 26 ఏళ్ల క్రితం విధుల నుంచి తొలగించబడ్డారు. ఆ తర్వాత తిరిగి ఉద్యోగం దక్కించుకునేందుకు అతను ఎన్నో ప్రయత్నాలు చేశారు. కోర్టులో అనేకసార్లు అప్పీలుకు వెళ్లారు. అయినా కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఒక రూపాయల వల్ల ఒక ఉద్యోగి ఉద్యోగం కోల్పోవడం అంటే చాలా విచిత్రంగా ఉంది కదా. అయితే అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ముంబాయిలో జరిగినటువంటి ఘటన ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనల ఇప్పడు చర్చనీయాంశమవుతోంది. 6 రూపాయల చిల్లర ఇవ్వని కారణంగా రైల్వే క్లర్క్ ఉద్యోగం కోల్పోవడం ఏంటని ఆశ్యర్యపోతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే ముంబయి కుర్లా టెర్మినల్ జంక్షన్ వద్ద రాజేశ్ వర్మ అనే వ్యక్తి రైల్వే టికెట్ క్లర్క్గా విధులు నిర్వర్తించేవారు. అయితే 1997వ సంవత్సలో ఆగస్టు 30 వ తేదీన విజిలెన్స్ బృందం ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ను ప్యాసింజర్గా పంపి టికెట్ కొనుగోలు చేయించేలా చేశారు. అయితే ఇందులోనే రాజేష్ వర్మ అడ్డంగా బుక్కయ్యారు. అక్కడ ఏం జరిగిందంటే ఆ ప్రయాణికుడు టికెట్ క్లర్క్ అయిన రాజేష్ వర్మకు 500 రూపాయలు ఇచ్చాడు. వాస్తవానికి టికెట్ ధర 214 రూపాయలు మాత్రమే. ఇక మిగిలిన డబ్బులు 286 రూపాయలు రాజేష్ వర్మ ఆ ప్రయాణికుడికి ఇవ్వాలి. కానీ ఆ ప్రయాణికుడికి వర్మ 280 రూపాయలు మాత్రమే ఇచ్చాడు. మిగతా చిల్లరు అయిన ఆరు రూపాయలు ఇవ్వలేదు. దీంతో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. అయితే ఆ రోజు వసూళ్లో సుమారు 58 రూపాయల వరకు మిస్ అయ్యాయి. అంతేగాక ఆ క్లర్క్ వెనకాల ఉన్న అల్మారాలో 450 రూపాయలు ఉన్నట్లు గుర్తించారు.




ఇక రాజేష్ వర్మ అక్రమ మార్గంలో డబ్బులు సంపాదిస్తున్నట్లు అధికారులు ఓ అంచనాకు వచ్చేశారు. ఇంకేముంది క్రమశిక్షణా చర్యల కింద రాజేష్ వర్మను 2002 సంవత్సరంలో జనవరి 31న విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. చివరికి అతడ్ని ఉద్యోగంలో నుంచి తీసేశారు. అయితే ఆ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని రాజేశ్ వర్మ ఖండించారు. ఇందుకోసం వాళ్ల నిర్ణయాన్ని సవాలు చేస్తూ అప్పీలుకు వెళ్లారు. రాజేష్ వర్మ కేవలం 6 రూపాయల చిల్లర మాత్రమే ఇవ్వలేకపోయాడని అతని తరఫున న్యాయవాది మిహర్ దేశాయ్ కోర్టుకు తెలియజేశారు. అలాగే అల్మారాను రాజేశ్ వర్మతో సహా అక్కడి ఉద్యోగులందరూ కూడా వినియోగిస్తారని పేర్కొన్నారు. చిల్లర ఇవ్వలేదనడానికి ఎలాంటి ఆధారాలు కూడా లేనప్పటికీ కూడా అల్మారాకు ప్రవేశం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. అధిక ఛార్జీలు వసూలు చేశారనడానికి సరైన రుజువు ఉందని పేర్కొంది. ఇక చివరికి రాజేష్ వర్మ చేసినటువంటి అప్పీలును తిరస్కరించింది.