200మంది బీజేపీ కార్యకర్తలు మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ లో చేరిక… తప్పు చేశామంటూ…

బెంగాల్ లోని హుగ్లీ జిల్లాకు చెందిన సుమారు 200 మంది బీజేపీ కార్యకర్తలు తిరిగి తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. తాము 'తప్పు' చేశామని చెప్పుకున్న వీరు.. శిరోముండనం చేయించుకున్నారు.

200మంది బీజేపీ కార్యకర్తలు మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ లో చేరిక... తప్పు చేశామంటూ...
200 Bjp Workers Joined
Follow us

| Edited By: Phani CH

Updated on: Jun 22, 2021 | 10:57 PM

బెంగాల్ లోని హుగ్లీ జిల్లాకు చెందిన సుమారు 200 మంది బీజేపీ కార్యకర్తలు తిరిగి తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. తాము ‘తప్పు’ చేశామని చెప్పుకున్న వీరు.. శిరోముండనం చేయించుకున్నారు. అంతటితో ఆగక.. తమను తాము గంగాజలంతో ”శుద్ది’ చేసుకున్నారు. ఛాలా పెద్ద పొరబాటు చేశామని, పరిశుద్ధమైన గంగాజలంతో తమను తాము ప్రక్షాళన చేసుకున్న తరువాతే తమ మాతృక సంస్థలో చేరుతున్నామని వారు తెలిపారు. టీఎంసీ పతాకాలతో సహా వచ్చి….ఆరాంబాగ్ ఎంపీ అపరూప పొద్దార్ సమక్షంలో వీళ్లంతా ఈ పార్టీలో చేరారు.. ఆయనతో చేతులు కలిపారు. ఆరాంబాగ్ లో పేదలకు తాము ఉచిత అన్నదాన కార్యక్రమం చేపట్టగా దళితులు కొందరు వచ్చి తాము బీజేపీలో చేరి పొరబాటు చేశామని..తిరిగి తృణమూల్ కాంగ్రెస్ లో చేరాలనుకుంటున్నామని చెప్పారని పొద్దార్ వెల్లడించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయంతో వివిధ జిల్లాలనుంచి వందలాది బీజేపీ కార్యకర్తలు మళ్ళీ ఈ పార్టీలో చేరుతున్నారు.

ఈ నెలారంభంలో బీర్ భమ్ జిల్లాకు చెందిన సుమారు 50 మంది బీజేపీ కార్యకర్తలు తృణమూల్ లో చేరిపోయారు. తమను మళ్ళీ పార్టీలోకి చేర్చుకోవాలంటూ పార్టీ కార్యాలయం వద్ద ధర్నా కూడా చేశారు. కమలం పార్టీలో చేరినందుకు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నామని, ఇక తృణమూల్ ను విడబోమని వీరు ముక్త కంఠంతో చెప్పారట.. వీరే కాక..పలువురు సీనియర్ నేతలు కూడా బీజేపీ నుంచి మళ్లీ ఈ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో మాజీ డిప్యూటీ స్పీకర్ కూడా ఉన్నారు. అయితే ఎన్నికల అనంతర హింసతో భయపడిపోయిన వీరంతా మళ్ళీ తృణమూల్ లో చేరారని బీజేపీ నేతలు అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: పంజాబ్ కాంగ్రెస్ లో అసమ్మతి చిచ్చు… చిక్కుల్లో సీఎం అమరేందర్ సింగ్ ..నాయకత్వ మార్పు తప్పదా …?

YSR Cheyutha Scheme 2021: గుడ్‌న్యూస్.. ‘వైఎస్ఆర్ చేయూత’ దరఖాస్తు గడుపు పెంపు.. మరో నెల రోజులు అవకాశం..

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు