అమర్‌నాథ్ యాత్రికులు బ్రేక్ ఫెయిల్.. కదులుతున్న బస్సు నుంచి దూకిన ప్రయాణీకులు 10 మందికి గాయాలు..

ఓ యాత్రికుల బస్సు అమర్‌నాథ్ యాత్ర యాత్రను ముగించుకుని పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌కు తిరిగి వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యాత్రికులను బస్సులో 40 మంది యత్రికులున్నారు. ఈ బస్సు బనిహాల్ సమీపంలోని నచ్లానాకు చేరుకోగా.. బస్సు బ్రేక్‌లు విఫలమయ్యాయి.. దీంతో డ్రైవర్ వాహనాన్ని ఆపడంలో విఫలమయ్యాడని అధికారులు తెలిపారు. ఈ ఘటన జమ్మూకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది.

అమర్‌నాథ్ యాత్రికులు బ్రేక్ ఫెయిల్.. కదులుతున్న బస్సు నుంచి దూకిన ప్రయాణీకులు 10 మందికి గాయాలు..
Amarnath Yatra
Follow us

|

Updated on: Jul 03, 2024 | 11:31 AM

కొంతమంది భక్తులు అమర్‌నాథ్ యాత్రను పూర్తి చేసుకుని తిరిగి స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. ఇలా అమర్నాథ్ యాత్ర యాత్రికుల బస్సు బ్రేక్ ఫెయిల్యూర్ అయింది. దీంతో ఆ బస్సులో ఉన్న పలువురు ప్రయాణీకులు భయంతో కదులుతున్న బస్సు నుంచి దూకేశారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి సహా కనీసం 10 మంది యాత్రికులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఓ యాత్రికుల బస్సు అమర్‌నాథ్ యాత్ర యాత్రను ముగించుకుని పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌కు తిరిగి వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యాత్రికులను బస్సులో 40 మంది యత్రికులున్నారు. ఈ బస్సు బనిహాల్ సమీపంలోని నచ్లానాకు చేరుకోగా.. బస్సు బ్రేక్‌లు విఫలమయ్యాయి.. దీంతో డ్రైవర్ వాహనాన్ని ఆపడంలో విఫలమయ్యాడని అధికారులు తెలిపారు. ఈ ఘటన జమ్మూకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది.

అమర్‌నాథ్ యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న యాత్రికులున్న బస్సు బ్రేక్‌లు ఫెయిల్‌ అయిందని బస్సులోకి ప్రయాణీకులకు డ్రైవర్‌ సమాచారం ఇచ్చాడు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణీకుల్లో కొందరు బస్సు నుంచి బయటకు దూకేశారు. ఈ సమయంలో కొందరికి గాయాలు అయ్యాయి. అందులో నుంచి దూకి గాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటన జమ్మూకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. కదులుతున్న వాహనంలో నుంచి యాత్రికులు దూకడం గమనించిన అధికారులు, ఆర్మీ దళాలు, పోలీసు సిబ్బంది వేగంగా చర్యలు చేపట్టారు. భారత ఆర్మీ స్పందించింది.. బ్రేక్ ఫెయిల్ అయిన బస్సును ఆర్మీ ,పోలీసు సిబ్బంది వేగంగా చర్యలు చేపట్టారు. బస్సు టైర్ల కింద రాళ్లను అడ్డుకట్టగా వేసి బస్సు నది ప్రవాహంలోకి వెళ్ళకుండా అడ్డుకున్నారు. తద్వారా జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిలో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. యాక్సిడెంట్ సంఘటనా స్థలానికి చేరుకున్న ఆర్మీ సిబ్బంది వెంటవెంటనే చర్యలు మొదలు పెట్టారు. అంబులెన్స్‌ సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారందరికీ వైద్య సహాయం, ప్రథమ చికిత్స అందించాయి,” అని అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..