AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేసవిలో శీతలాన్ని ఎంజాయ్ చేయాలంటే ముస్సోరి బెస్ట్ ఎంపిక.. ఈ తప్పులు చేయకుండా ట్రిప్ ని ఎంజాయ్ చేయండి..

మనాలి, సిమ్లా లాగా ఇక్కడ వేసవి సెలవులు మొదలైతే ఓ రేంజ్ లో పర్యాటకుల సందడి మొదలవుతుంది. ముస్సోరీలోని మాల్ రోడ్ మాత్రమే కాదు, కెంప్టీ ఫాల్,  కంపెనీ గార్డెన్ వంటి అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అయితే ఇతర కొండ ప్రాంతాలతో పోలిస్తే ముస్సోరీలో ప్రయాణించడం కొంచెం చౌకగా పరిగణించబడుతుంది. ఇక్కడికి ప్రయాణానికి వెళ్ళే చాలా మంది పర్యాటకులు, కొన్ని పొరపాట్లను చేస్తారు. అలాంటి సమయంలో ఆనందం మొత్తం చెడిపోతుంది.

వేసవిలో శీతలాన్ని ఎంజాయ్ చేయాలంటే ముస్సోరి బెస్ట్ ఎంపిక.. ఈ తప్పులు చేయకుండా ట్రిప్ ని ఎంజాయ్ చేయండి..
Mussoorie Trip
Surya Kala
|

Updated on: Apr 26, 2024 | 8:23 PM

Share

మనదేశంలో ప్రకృతి అందాలకు నెలవైన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఉత్తరాఖండ్ లోని  ముస్సోరీ. దీనిని కొండల రాణి అని ముద్దుగా పిలుచుకుంటారు.  ఇది అందమైన ప్రకృతి దృశ్యాలతో కనువిందు చేసే ప్రదేశం. వేసవిలో హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి అనేక ప్రాంతాల నుండి పర్యాటకులు భారీ సంఖ్యలో ఇక్కడికి వస్తారు. మనాలి, సిమ్లా లాగా ఇక్కడ వేసవి సెలవులు మొదలైతే ఓ రేంజ్ లో పర్యాటకుల సందడి మొదలవుతుంది. ముస్సోరీలోని మాల్ రోడ్ మాత్రమే కాదు, కెంప్టీ ఫాల్,  కంపెనీ గార్డెన్ వంటి అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.

అయితే ఇతర కొండ ప్రాంతాలతో పోలిస్తే ముస్సోరీలో ప్రయాణించడం కొంచెం చౌకగా పరిగణించబడుతుంది. ఇక్కడికి ప్రయాణానికి వెళ్ళే చాలా మంది పర్యాటకులు, కొన్ని పొరపాట్లను చేస్తారు. అలాంటి సమయంలో ఆనందం మొత్తం చెడిపోతుంది.

ముస్సోరీ పర్యటన

ముస్సోరీ భారతదేశంలోని ఒక కొండ ప్రాంతం. తెలుగు వారు ముస్సోరీకి వెళ్లాలనుకుంటే ముందుగా దేశ రాజధాని ఢిల్లీకి చేరుకోవాలి. లేదా ఢిల్లీ నుంచి ముస్సోరీకి చేరుకుని రైలులో ప్రయాణాన్ని ఎంచుకుంటే, మీరు డెహ్రాడూన్‌లో దిగాలి. లేదా ఢిల్లీ నుంచి AC బస్సు టిక్కెట్లు రూ. 800 నుంచి 900 వరకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇంకా తక్కువ ధరలో ముస్సోరి చేరుకోవాలనుకుంటే ఉత్తరాఖండ్ రోడ్‌వేస్ బస్సును ఎంచుకోవచ్చు. దీని ధర రూ. 350 నుండి రూ. 400 వరకు ఉంటుంది. ఇందులో ఏసీ సౌకర్యం ఉండదు. అయితే అందమైన దృశ్యాలను వీక్షించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ముస్సోరీకి చేరుకున్నప్పుడు ఈ తప్పులు చేయకండి

ముస్సోరీకి చేరుకున్న తర్వాత పర్యాటకులు అనేక పొరపాట్లు చేస్తారు. ఇది వారి పర్యటన ఆనందాన్ని పాడు చేస్తుంది. వ్యక్తిగత కారులో వెళ్లేవారు మాల్‌లోకి ప్రవేశించేందుకు రూ.150 ఎంట్రీ ఫీజు చెల్లించాలి. అయితే సాయంత్రం 5 గంటల తర్వాత మాల్‌లోకి ప్రైవేట్ లేదా టూరిస్ట్ వాహనాలను అనుమతించరు. సాయంత్రం సమయంలో ఇక్కడికి చేరుకుంటే పార్కింగ్‌కు రెట్టింపు ధర చెల్లించాలి. అంతేకాదు ప్రైవేట్ పార్కింగ్ సౌకర్యం మాల్ నుండి కొంచెం దూరంలో ఉంది. అటువంటి పరిస్థితిలో మీరు మీ కుటుంబ సభ్యులు చాలా దూరం నడవవలసి ఉంటుంది.

ఆహార పదార్థాలు

ఇది ప్రముఖ పర్యాటక ప్రదేశం, బ్యాగ్ బరువు అవుతుందని తక్కువ ఆహార పదార్థాలను తీసుకుని వెళ్లారు. అయితే వేసవి సెలవుల కారణంగా ఈ ప్రాంతంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో ట్రాఫిక్ జామ్‌ ఏర్పడి  రైలులో చాలా సేపు వేచి ఉండాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో ఆకలితో ఇబ్బంది పడవచ్చు. పిల్లలు మీతో ఉంటే  మరిన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.  కనుక వేసవి సీజన్‌లో ముస్సోరీకి వెళుతున్నట్లయితే బ్యాగ్‌లో డ్రై ఫ్రూట్స్ లేదా ఇతర ఆరోగ్యకరమైన ఆహారపు వస్తువులను తీసుకుని వెళ్ళండి.

ఎటువంటి దుస్తులు తీసుకుని వెళ్లాలంటే..

ఎవరైనా ఇక్కడకు పిల్లలని తీసుకుని వెళ్తే.. తప్పని సరిగా ఉన్ని దుస్తులను తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ వాతావరణం ఉదయం, సాయంత్రం చల్లగా మారుతుంది. వేసవిలో ఇక్కడ వాతావరణం అద్భుతంగా ఉంటుంది. అయితే మీతో పాటు పిల్లలతో ఉంటే ఖచ్చితంగా వెచ్చని బట్టలు తీసుకుని వెళ్ళండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us