AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navaratri 2024: నవరాత్రి స్పెషల్.. సగ్గుబియ్యంతో చేసిన స్పెషల్ వంటకాలు రెసిపీ.. మీ కోసం

ఉపవాస సమయంలో సగ్గుబియ్యంతో చేసిన ఆహారాలను ఎక్కువగా తింటారు. అంతేకాదు సగ్గుబియ్యం తేలికాగా, సులభంగా జీర్ణమవుతుంది.అయితే చాలా మంది రకరకాల కిచిడీని తినడానికి ఇష్టపడతారు. ఈ నేపధ్యంలో ఈ రోజు సగ్గుబియ్యంతో చేసిన అనేక ఇతర వంటకాలు కూడా ఉన్నాయి. సగ్గుబియ్యంతో రకరకాల ఆహారపదార్థాలను తయారు చేసుకోవచ్చు. ఉపవాసం చేసే సమయంలో అన్నాన్నికి బదులుగా సగ్గు బియ్యంతో చేసిన ఆహారపదార్ధాలను తినవచ్చు.

Navaratri 2024:  నవరాత్రి స్పెషల్.. సగ్గుబియ్యంతో చేసిన స్పెషల్ వంటకాలు రెసిపీ.. మీ కోసం
Shardiya Navratri
Surya Kala
|

Updated on: Oct 02, 2024 | 3:13 PM

Share

భారతదేశంలో దేవీ నవరాత్రి ఉత్సవాలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవిని పూజిస్తారు. ఈ సమయంలో భక్తులు దుర్గాదేవి అవతారలను పూజిస్తారు. అయితే ఈ సమయంలో అన్నానికి బదులుగా మరికొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటారు. ఉపవాస సమయంలో సగ్గుబియ్యంతో చేసిన ఆహారాలను ఎక్కువగా తింటారు. అంతేకాదు సగ్గుబియ్యం తేలికాగా, సులభంగా జీర్ణమవుతుంది.

అయితే చాలా మంది రకరకాల కిచిడీని తినడానికి ఇష్టపడతారు. ఈ నేపధ్యంలో ఈ రోజు సగ్గుబియ్యంతో చేసిన అనేక ఇతర వంటకాలు కూడా ఉన్నాయి. సగ్గుబియ్యంతో రకరకాల ఆహారపదార్థాలను తయారు చేసుకోవచ్చు. ఉపవాసం చేసే సమయంలో అన్నాన్నికి బదులుగా సగ్గు బియ్యంతో చేసిన ఆహారపదార్ధాలను తినవచ్చు.

సగ్గుబియ్యం వడ

సగ్గుబియ్యం వడ చేయడానికి కావాల్సిన పదార్ధాలు 1 కప్పు సగ్గుబియ్యం, నెయ్యి , 1 ఉడికించిన బంగాళాదుంపలు, 2 తరిగిన పచ్చిమిర్చి, 2 కప్పులు వేయించిన వేరుశెనగలు, ఉపవాస సమయంలో ఉపయోగించాల్సిన రాక్ ఉప్పు, రుచి ప్రకారం ఎండుమిర్చి.

ఇవి కూడా చదవండి

తయారుచేసే విధానం: ముందుగా సగ్గుబియ్యన్ని 3 నుంచి 4 గంటలు నానబెట్టాలి. దీని తర్వాత సగ్గుబియ్యాన్ని నీటితో కడిగి ఒక గిన్నెలోకి తీసుకుని అందులో ఉడికించిన బంగాళాదుంపలను వేసి మెత్తగా చేయాలి. దీని తర్వాత పచ్చిమిర్చి, వేయించిన శనగపప్పు, ఉప్పు ఇలా అన్నీ కలిపి మిశ్రమంలా చేసి చిన్న చిన్న వడలు చేసి వేడి నెయ్యిలో బంగారు రంగు వచ్చేవరకు వేయించి వేడి వేడిగా సర్వ్ చేయాలి.

సగ్గుబియ్యం ఖీర్

సగ్గుబియ్యం ఖీర్ చేయడానికి కావాల్సిన పదార్ధాలు 1/2 కప్పు సగ్గుబియ్యం, 1 లీటర్ పాలు, 1/2 కప్పు చక్కెర, 1/2 టీస్పూన్ యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్లు తరిగిన జీడిపప్పు , బాదం పప్పు అవసరం.

తయారుచేసే విధానం: దీని కోసం ముందుగా సగ్గుబియ్యంను 1 గంట నానబెట్టాలి. దీని తర్వాత పాలలో పంచదార, యాలకులు వేసి మరిగించాలి. దీని తరువాత దానికి సగ్గుబియ్యం జోడించండి. కొన్ని నిమిషాలు ఉడికించాలి. దీని తరువాత అవసరాన్ని బట్టి నీరు కలపండి. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికే వరకు ఉడికించాలి. ఆ తర్వాత తరిగిన డ్రై ఫ్రూట్ ముక్కలతో గార్నిష్ చేసి వేడిగా సర్వ్ చేయాలి.

సగ్గుబియ్యం చాట్

సగ్గుబియ్యం చాట్ తయారీకి 1 కప్పు సగ్గుబియ్యం, ఉడికించి, తరిగిన 1 బంగాళాదుంప, 1 తరిగిన టమోటా, 1/2 కప్పు పెరుగు, చట్నీ, ఫాస్టింగ్ రాక్ సాల్ట్, నల్ల మిరియాలు, వేరుశెనగలు, చీజ్ అవసరం.

తయారుచేసే విధానం ముందుగా సగ్గుబియ్యన్ని నీటిలో 1 గంట నానబెట్టాలి. దీని తరువాత వేరుశెనగలను వేయించాలి. ఇప్పుడు బంగాళదుంపలను ఉడకబెట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అన్ని పదార్థాలను ఒక గిన్నెలో వేసి పెరుగు, చట్నీ కలపండి. ఉప్పు, మసాలాలు వేసి బాగా కలపాలి. దీంతో సగ్గుబియ్యం చాట్ సిద్ధంగా ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..