AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెరిసే చర్మం కోసం..! మీకు పదే పదే ముఖం కడుక్కునే అలవాటు ఉందా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

మీకు పదే పదే ముఖం కడుక్కునే అలవాటు ఉంటే అది మంచిది కాదు. మీరు చర్మం రకం ప్రకారం ముఖం కడగాలి. అలా చేయడం కొన్నిసార్లు చర్మానికి హానికరం. ఆరోగ్యవంతమైన చర్మాన్ని కాపాడుకోవడానికి రోజుకు ఎన్నిసార్లు మీ ముఖాన్ని కడగాలో ఇక్కడ తెలుసుకుందాం..

మెరిసే చర్మం కోసం..! మీకు పదే పదే ముఖం కడుక్కునే అలవాటు ఉందా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Face Wash
Jyothi Gadda
|

Updated on: Feb 16, 2024 | 12:21 PM

Share

వచ్చేది వేసవి కాలం.. కానీ, అప్పుడే ఎండవేడిమి, ఉక్కపోత మొదలైంది. అటువంటి పరిస్థితిలో, చర్మంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. సూర్యరశ్మి, వేడి, చెమట చర్మంపై అనేక సమస్యలను కలిగిస్తుంది. వేసవిలో ప్రజలు మళ్లీ మళ్లీ ముఖం కడుక్కోవడానికి ఇదే కారణం. కొంతమందికి రోజుకు చాలాసార్లు ముఖం కడుక్కోవడం అలవాటుగా ఉంటుంది.. ముఖ్యంగా వేసవిలో తరచుగా ముఖం కడుక్కోవడం వల్ల వేడి నుండి ఉపశమనం లభిస్తుందని చాలా మంది భావిస్తారు. ముఖం కడుక్కుంటే ముఖం మెరుస్తుంది. కానీ, అలా చేయడం కొన్నిసార్లు చర్మానికి హానికరం. ఒక రోజులో ఎన్ని సార్లు ముఖం కడుక్కోవాలో తెలుసుకుందాం.

ఒక రోజులో ఎన్ని సార్లు ముఖం కడుక్కోవాలి?

మీరు ఉదయం నిద్ర లేవగానే, ముందుగా మీ ముఖాన్ని కడుక్కోండి. ఇది సోమరితనాన్ని తొలగించడమే కాకుండా మీ శరీరం తక్షణమే రిఫ్రెష్‌గా మారుతుంది. ఉదయాన్నే ముఖం కడుక్కోవడం వల్ల ముఖ రంద్రాలు క్లియర్ అవుతాయి. అయితే, ఇక్కడ మీరు తేలికపాటి ఫేస్ వాష్‌తో సాధారణ నీటితో మీ ముఖాన్ని కడుక్కోవాలని గుర్తుంచుకోండి.

ఇవి కూడా చదవండి

మీ చర్మం జిడ్డుగా ఉన్నట్లయితే, మీరు మధ్యాహ్నం ఒకసారి మీ ముఖాన్ని కడగవచ్చు. జిడ్డు చర్మం ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు సబ్బు లేదా ఫేస్ వాష్ వాడాలి. ఉదయం ముఖం కడుక్కున్న తర్వాత, మధ్యాహ్నానికి జిడ్డు చర్మం ఉన్నవారి ముఖంపై నూనె పేరుకుపోతుంది. కాబట్టి, అలాంటి వారు మధ్యాహ్న సమయంలో కూడా చల్లటి నీటితో లేదా ఫేస్ వాష్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవచ్చు.

మీరు పని నుండి తిరిగి వచ్చినప్పుడు, మీ ముఖాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోండి. దీంతో ఆరోజు అలసట తొలగిపోతుంది. ముఖంపై పేరుకున్న మురికి కూడా తొలగిపోతుంది. కొంతమంది వేసవిలో సాయంత్రం కూడా స్నానం చేస్తారు. మీరు అలా చేయలేకపోతే, కనీసం ఒక్కసారైనా మీ ముఖాన్ని బాగా కడగాలి.

కానీ, మీ చర్మం ఆరోగ్యంగా, మెరుస్తూ ఉండాలంటే, వీలైనంత ఎక్కువ నీరు తాగటం అలవాటు చేసుకోండి. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది.

రోజూ మీ ఆహారంలో ఒక తాజా జ్యూస్‌ ఏదైనా ఉండేలా చూసుకోండి. ఇలా చేయడం వల్ల మీ చర్మం మెరుస్తుంది. మీరు మీ ఆహారంలో విటమిన్ సి, విటమిన్ ఇ అధికంగా ఉండే వాటిని చేర్చుకోవాలి.

మీ ఆహారంలో పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా క్యారెట్, దోసకాయ, బొప్పాయి, దానిమ్మ, కలబంద వంటి వాటిని తీసుకోవడం వల్ల ముఖం ఆరోగ్యంగా ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..