AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీకు మాంసాహారం అంటే ఇష్టమా.. అయితే ఆశ్చర్యకరమైన నిజాలు తెలుసుకోండి..

Non Vegetarian: భారతదేశంలో 70 శాతానికి పైగా ప్రజలు చేపలు, మాంసం లేదా గుడ్ల వంటి ఆహారాలను తింటున్నారు. ఇందులో పోషక విలువలు అధికంగా ఉన్నప్పటికీ

మీకు మాంసాహారం అంటే ఇష్టమా.. అయితే ఆశ్చర్యకరమైన నిజాలు తెలుసుకోండి..
India Meat
uppula Raju
|

Updated on: Nov 19, 2021 | 6:04 AM

Share

Non Vegetarian: భారతదేశంలో 70 శాతానికి పైగా ప్రజలు చేపలు, మాంసం లేదా గుడ్ల వంటి ఆహారాలను తింటున్నారు. ఇందులో పోషక విలువలు అధికంగా ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాలు మాత్రం వీటిని వ్యతిరేకిస్తున్నాయి. పాఠశాల మధ్యాహ్న భోజనంలో గుడ్లను అనుమతించడం లేదు. తక్కువ మాంసాహారం తినే రాష్ట్రాల ప్రజలు గుడ్లను ఇష్టపడటం లేదు. అయితే ఇటీవల చిన్నారుల భోజనంలో కోడిగుడ్లను చేర్చాలన్న నిర్ణయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం భోజనంలో కోడిగుడ్లను తొలగించగా కర్ణాటక కూడా అదే విధంగా చేసింది.

భారతీయులకు మాంసాహారం అంటే ఇష్టం భారతదేశంలో శాకాహారంపై చర్చ ఇప్పటిది కాదు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం.. దేశంలో 70 శాతం మంది మహిళలు, 78 శాతం మంది పురుషులు ఏదో ఒక రకమైన మాంసాన్ని తింటున్నారని సూచిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలలో మాంసాహారుల నిష్పత్తి 97 శాతానికి పైగా ఉంది. దీనికి విరుద్ధంగా, పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్‌లలో తక్కువ మాంసాహార జనాభా (40 శాతం లోపు) ఉంది. భారతదేశంలో మాంసం వినియోగం, ఆదాయం రెండు పెరిగాయి.

2020లో భారతదేశం ఆరు మిలియన్ టన్నుల మాంసాన్ని వినియోగించింది. దాదాపు సగం మంది జనాభా వారానికి ఒకసారైనా మాంసాహార భోజనాన్ని తింటున్నారు. యాదృచ్ఛికంగా పశ్చిమ బెంగాల్, కేరళతో సహా తొమ్మిది రాష్ట్రాలలో మాత్రమే మాంసం వినియోగంపై ఎటువంటి ఆంక్షలు లేవు. చాలా ఇతర రాష్ట్రాలు మాంసం రకాన్ని బట్టి కొన్ని రకాల పరిమితులు విధించాయి. ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకారం.. ప్రపంచ మాంసం ఉత్పత్తిలో భారతదేశం 2.18 శాతం వాటాను కలిగి ఉంది. చైనా, యునైటెడ్ స్టేట్స్, బ్రెజిల్, రష్యా, జర్మనీల తర్వాత ఆరో స్థానంలో కొనసాగుతుంది.

Crime News: గాలి నింపుతుండగా పేలిన ట్రాక్టర్‌ టైర్‌.. ఎగిరిపడిన బాలుడు.. విరిగిన చేతులు

Indian Railway: అలసిపోయిన ప్రయాణికుల కోసం కొత్త సేవలు.. విశ్రాంతి తీసుకోవడానికి వీటి ఏర్పాటు..

Crime News: కేసు విచారిస్తుండగా జడ్జిపైనే దాడి చేసిన ఇద్దరు పోలీసులు.. ఎక్కడో తెలుసా..?