AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thene Mitayi: చిన్నప్పుడు తినే తేనె మిఠాయిలను ఇలా ఈజీగా చేసుకోవచ్చు!

తేనె మిఠాయిలు మీకు గుర్తొన్నాయ్యా.. పాత కాలంలో బాగా ఎక్కువగా లభించేవి. చిన్న పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. ప్రస్తుతం ఇవి ఎక్కడా కనిపిచండం లేదు. చాలా మంది వీటిని రుచి చూసే ఉంటారు. ఇప్పుడు జనరేషన్ కు తెలీదు కానీ.. ఓ 20 సంవత్సరాల క్రితం వారికి అయితే బాగా తెలుస్తాయి. మీరు వీటి టేస్ట్ ని మిస్ అవుతున్నారా.. అస్సలు బాధ పడాల్సిన పని లేదు. ఈ తేనె మిఠాయిలను ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. వీటి ప్రాసెస్ కూడా సులభంగానే..

Thene Mitayi: చిన్నప్పుడు తినే తేనె మిఠాయిలను ఇలా ఈజీగా చేసుకోవచ్చు!
Thene Mitayi
Chinni Enni
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 30, 2023 | 8:25 AM

Share

తేనె మిఠాయిలు మీకు గుర్తొన్నాయ్యా.. పాత కాలంలో బాగా ఎక్కువగా లభించేవి. చిన్న పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. ప్రస్తుతం ఇవి ఎక్కడా కనిపిచండం లేదు. చాలా మంది వీటిని రుచి చూసే ఉంటారు. ఇప్పుడు జనరేషన్ కు తెలీదు కానీ.. ఓ 20 సంవత్సరాల క్రితం వారికి అయితే బాగా తెలుస్తాయి. మీరు వీటి టేస్ట్ ని మిస్ అవుతున్నారా.. అస్సలు బాధ పడాల్సిన పని లేదు. ఈ తేనె మిఠాయిలను ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. వీటి ప్రాసెస్ కూడా సులభంగానే ఉంటుంది. మరి ఈ తేనె మిఠాయిలకు కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

తేనె మిఠాయిలకు కావాల్సిన పదార్థాలు:

మినప గుళ్లు – పావు కప్పు, బియ్యం – ఒక కప్పు, వంట సోడా – కొద్దిగా, పంచదార – రెండు కప్పులు, ఉప్పు – కొద్దిగా, ఫుడ్ కలర్ – కొద్దిగా, నిమ్మరసం – కొద్దిగా, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా.

ఇవి కూడా చదవండి

తేనె మిఠాయిలు తయారు చేయు విధానం:

ముందుగా ఒక గిన్నెలో మినప గుళ్లు పావు కప్పు, బియ్యం ఒక కప్పు వేసుకుని నానబెట్టు కోవాలి. తర్వాత వీటిని శుభ్రంగా కడిగి మిక్సీ జార్ లో వేసి పిండి గట్టిగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండిలో వంట సోడా, సరిపడగా ఉప్పు, కొద్దిగా ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని కాసేపు పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. ఇందులో పంచదార, నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి. ఈ పాకం జిగురుగా వచ్చేలా చేయాలి. ఇందులో కొద్దిగా నిమ్మ రసం కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

ఇప్పుడు మంద పాటి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వెడెక్కాక.. చిన్న చిన్న గోళీల ఆకారంలో వేసి వేయించుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యేంత వరకూ కాల్చుకోవాలి. వీటిని నూనె నుంచి తీసేసి పంచదార పాకంలో వేసుకోవాలి. వీటిని 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత పాకం నుంచి తీసి సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే తేనె మిఠాయిలు రెడీ. వీటిని చిన్న పిల్లలకు ఇస్తే.. ఎంతో ఇష్టంగా తింటారు.