Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: నిత్యం కడుపు ఉబ్బరంగా ఉంటుందా.? ఇదే కారణం..

కడుపు ఉబ్బరం తీసుకునే ఆహారం కారణంగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వేయించిన ఆహారాన్ని తీసుకోవడం, జీర్ణక్రియ సమస్యలతో పాటు కొన్ని రకాల ఆరోగ్య సంబంధిత సమస్యల వల్ల కడుపుబ్బరం వేధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఒత్తిడితో ఇబ్బందిపడుతోన్న వారిలోనూ ఇలాంటి సమస్యలు వస్తాయి...

Lifestyle: నిత్యం కడుపు ఉబ్బరంగా ఉంటుందా.? ఇదే కారణం..
Stomach Bloating
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 25, 2024 | 12:12 PM

కడుప్పు ఉబ్బరం సర్వసాధారణమైన సమస్య. మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో ఈ సమస్యను ఎదుర్కొనే ఉంటాం. మరీ ముఖ్యంగా వేసవిలో కడుపు ఉబ్బరం సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. అయితే ఈ సమస్య రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ప్రధానమైంది తీసుకునే ఆహారమే అని చెప్పాలి. ఆహారంలో కొన్ని మార్పుల కారణంగా కడుపు ఉబ్బరంగా మారుతుంది. ఇంతకీ కడుపు ఉబ్బరం సమస్య ఎందుకు వస్తుంది.? ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కడుపు ఉబ్బరం తీసుకునే ఆహారం కారణంగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వేయించిన ఆహారాన్ని తీసుకోవడం, జీర్ణక్రియ సమస్యలతో పాటు కొన్ని రకాల ఆరోగ్య సంబంధిత సమస్యల వల్ల కడుపుబ్బరం వేధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఒత్తిడితో ఇబ్బందిపడుతోన్న వారిలోనూ ఇలాంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే శారీరకంగా చురుకుగా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం వాకింగ్‌ను అలవాటుగా మార్చుకోవాలని చెబుతున్నారు.

వీటివల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. అలాగే యోగాసానల వల్ల కూడా కడుపులో గ్యాస్‌ సమస్యలు దరిచేరకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మలబద్ధకం సమస్య ఉన్న వారు కూడా కడుపుబ్బరం సమస్యతో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి వారు తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండే ఫుడ్‌ను తీసుకోవాలి.

ఆహారంలో పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫైబర్‌ ఎక్కువగా లభించే అరటి పండు, యాపిల్‌, ఆరెంజ్‌ వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక కడుపు సంబంధిత సమస్యల నుంచి బయటపడాలంటే సోడియం ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. ఉప్పుడు ఎక్కువగా తీసుకోవడం కడుపుఉబ్బరంతో పాటు, అధిక రక్తపోటు సమస్య కూడా వస్తుందని చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..