ఎంత దారుణం.. ఐదేళ్ల బాలుడ్ని ఎరగా వాడిన ICE
అమెరికాలో ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం కావడంతో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. మినియాపోలిస్లో ఒక అమెరికా పౌరుడిని ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు కాల్చి చంపగా, అంతకుముందు ఐదేళ్ల బాలుడిని ఎరగా వాడి తల్లిదండ్రులను అరెస్టు చేశారు. ఈ ఘటనలతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. భారతీయ వలసదారుల అరెస్టులు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి.
అమెరికాలో ఇమ్మిగ్రేషన్ నియమాలు మరింత ప్రమాదకరంగా మారుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ల ప్రవర్తన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. ఇటీవల మినియాపోలిస్లో 37 ఏళ్ల అలెక్స్ ప్రెట్టి అనే అమెరికా పౌరుడిని కాల్చి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అధికారుల వాదనలకు విరుద్ధంగా, ప్రెట్టి వద్ద కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇద్దరు మహిళలను కాపాడే ప్రయత్నంలో ప్రెట్టిని అదుపులోకి తీసుకుని, ఆపై కాల్చి చంపారు.ఈ నెలలోనే ఇది రెండో కాల్పుల ఘటన. జనవరి 7న రెనీ గూడ్ అనే మరో అమెరికా పౌరుడు కూడా ఫెడరల్ ఏజెంట్ల కాల్పుల్లో మరణించాడు. అంతకుముందు, ఐదేళ్ల బాలుడిని ఎరగా వాడి అతని తల్లిదండ్రులను అరెస్టు చేసిన ఘటన కూడా అమెరికాను కుదిపేసింది.
మరిన్ని వీడియోల కోసం :
టోల్గేట్ వద్ద గుట్టు గుట్టలుగా నోట్ల కట్టలు!
స్థిరంగా బంగారం ధరలు.. బడ్జెట్ తర్వాత తగ్గే ఛాన్స్?
ఏడేళ్లుగా రైల్వేపై విద్యార్థిని పోరాటం..చివరకు..
గ్యాస్ సెగ.. మళ్లీ లాక్డౌన్ తప్పదా
విమానంలో బీడీ తాగాడు.. కట్ చేస్తే.. ఇలా అయ్యాడు
చిలుక జోస్యం చెప్పే వ్యక్తి చేతిలో.. లక్షలు పోగొట్టుకున్న అధికారి
ఈమె అవతారం చూసి పిచ్చిది అనుకుంటున్నారా ?? కాదు గొప్ప సెలబ్రిటీ
చితి పెడదాం అని తీసుకెళ్లారు.. ఈ లోపే తిరిగి లేచాడు
కోతులకు భయం.. భక్తులకు అభయం !! హనుమంతుడి రూపంలో ఆశీస్సులు
ప్రస్తుతం బంగారం కంటే విలువైన సిలిండర్ల ట్రక్కు చోరీ

