మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కు ఆల్ సెట్
భారత్-యూరోప్ మధ్య దశాబ్దాలుగా చర్చల్లో ఉన్న ఫ్రీ ట్రేడ్ డీల్ తుది దశకు చేరింది. ఈ ఒప్పందం అమలైతే యూరోపియన్ కార్లపై దిగుమతి సుంకాలు గణనీయంగా తగ్గి, వాటి ధరలు తగ్గుతాయి. మెర్సిడెస్, BMW, ఆడి వంటి లగ్జరీ కార్లు భారత మార్కెట్లో మరింత సరసమైన ధరలకు అందుబాటులోకి వస్తాయి.
భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య కుదరనున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) భారత ఆటోమొబైల్ మార్కెట్లో కీలక మార్పులకు నాంది పలకనుంది. దశాబ్దాలుగా చర్చల్లో ఉన్న ఈ డీల్ తుది దశకు చేరుకోగా, యూరోపియన్ కార్లపై ప్రస్తుతం ఉన్న 100-110 శాతం దిగుమతి సుంకాలు భారీగా తగ్గనున్నాయి. మొదటి దశలో సుమారు 40 శాతం వరకు సుంకం తగ్గే అవకాశం ఉంది, తదుపరి దశల్లో దీనిని 10 శాతానికి తగ్గించే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ సుంకాల తగ్గింపుతో యూరోప్లో 30 లక్షల ధర పలికే కారు భారత్లో ప్రస్తుతం 70 లక్షలకు అమ్ముడవుతుండగా, FTA తర్వాత సుమారు 45-50 లక్షలకే లభించనుంది. Mercedes-Benz, BMW, Audi, Volvo, Volkswagen వంటి బ్రాండ్ల కార్లు ఇప్పుడున్న లగ్జరీ విభాగం నుండి మిడిల్ రేంజ్ విభాగంలోకి వస్తాయి.
మరిన్ని వీడియోల కోసం :
టోల్గేట్ వద్ద గుట్టు గుట్టలుగా నోట్ల కట్టలు!
స్థిరంగా బంగారం ధరలు.. బడ్జెట్ తర్వాత తగ్గే ఛాన్స్?
ఏడేళ్లుగా రైల్వేపై విద్యార్థిని పోరాటం..చివరకు..
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

