AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేమిద్దరం కలిసి తిరిగినామంటే మొత్తం అపోజిషన్‌ ఖతం అయితది

మేమిద్దరం కలిసి తిరిగినామంటే మొత్తం అపోజిషన్‌ ఖతం అయితది

Samatha J
|

Updated on: Jan 29, 2026 | 12:52 PM

Share

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ పూర్తి సన్నద్ధతతో ఉందని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి, త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. నరేంద్ర మోదీ అభివృద్ధి అజెండాతో ఎన్నికలకు వెళ్తున్నామని, బీఆర్‌ఎస్‌ విధ్వంసాన్ని, కాంగ్రెస్ అవినీతిని ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. తమ పోటీ అధికార కాంగ్రెస్‌తోనే అని, బీఆర్‌ఎస్‌తో కాదని స్పష్టం చేశారు.

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో ప్రధాన పార్టీలన్నీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వెల్లడించారు. ఇప్పటికే ఎన్నికల ఇన్-చార్జ్‌లను నియమించి, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను దాదాపు పూర్తి చేశామని, త్వరలో అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తామని ఆయన తెలిపారు.బీజేపీ ప్రచార వ్యూహంలో భాగంగా సానుకూల ఓటింగ్‌ను కోరుకుంటుందని ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు. మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం నుండి నరేంద్ర మోదీ నాయకత్వంలో వచ్చిన నిధులు, అభివృద్ధి కార్యక్రమాలైన స్వచ్ఛ భారత్ మిషన్, పీఎం స్వనిధి, అమృత్ పథకం, స్మార్ట్ సిటీలు వంటి వాటిని ప్రజల ముందుంచుతామని వివరించారు.

మరిన్ని వీడియోల కోసం :

టోల్‌గేట్‌ వద్ద గుట్టు గుట్టలుగా నోట్ల కట్టలు!

స్థిరంగా బంగారం ధరలు.. బడ్జెట్‌ తర్వాత తగ్గే ఛాన్స్‌?

ఏడేళ్లుగా రైల్వేపై విద్యార్థిని పోరాటం..చివరకు..

చిరు వ్యాపారులకు అమెజాన్‌ బిగ్‌ ఆఫర్‌