AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాంక్ లో రూ.6వేలు పడాలంటే ఆధార్ ఉండాల్సిందే..

అన్నదాతకు సాయంగా కేంద్రం పలు పథకాలను ప్రారంభించింది. అందులో ఒకటి కిసాన్ సమ్మన్. ఈ నిధి కింద రైతులందరికీ రూ.6 వేలు అందించనున్నట్లు ఇటీవల బడ్జెట్ లో కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనికి ముఖ్యంగా ఆధార్ కార్డును తప్పనిసరి చేసింది. ఈ డబ్బులు రైతులు తీసుకోవాలంటే ఆధార్ లింక్ తప్పనిసరి. ఆధార్ కార్డు లేని రైతులు తక్షణమే దరఖాస్తూ చేయాలని కూడా సూచించింది. అయితే.. అందుకు ప్రత్యామ్నాయంగా ఆధార్ ఎన్ రోల్మెంట్ స్లిప్ లేదా […]

బ్యాంక్ లో రూ.6వేలు పడాలంటే ఆధార్ ఉండాల్సిందే..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 07, 2019 | 5:26 PM

Share

అన్నదాతకు సాయంగా కేంద్రం పలు పథకాలను ప్రారంభించింది. అందులో ఒకటి కిసాన్ సమ్మన్. ఈ నిధి కింద రైతులందరికీ రూ.6 వేలు అందించనున్నట్లు ఇటీవల బడ్జెట్ లో కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనికి ముఖ్యంగా ఆధార్ కార్డును తప్పనిసరి చేసింది. ఈ డబ్బులు రైతులు తీసుకోవాలంటే ఆధార్ లింక్ తప్పనిసరి. ఆధార్ కార్డు లేని రైతులు తక్షణమే దరఖాస్తూ చేయాలని కూడా సూచించింది. అయితే.. అందుకు ప్రత్యామ్నాయంగా ఆధార్ ఎన్ రోల్మెంట్ స్లిప్ లేదా ఓటర్ ఐడీ, రేషన్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పోస్ట్ ఆఫీస్ పాస్ బుక్, గెజిటెడ్ అధికారి లేదా తహశీల్దార్ అధికారిక పత్రం, కిసాన్ ఫోటో పాస్ బుక్, పాస్ పోర్ట్ వీటిల్లో ఏదో ఒకటి సమర్పించాలని కేంద్ర వ్యవసాయ శాఖ సూచించింది.

ఒకవేళ ఆధార్ కార్డ్ ఉన్నప్పటికీ వేలిముద్రలు అటాచ్ మెంట్ కాకపోతే ఫేస్ ఐడెంటిఫికేషన్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని స్పష్టం చేసింది. ఇవి కూడ సాధ్యం కాకపోతే.. ఆధార్ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయాలి లేదా రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ కు ఓటీపీ పంపడంద్వారా వివరాలను ఎన్ రోల్ చేసుకోవాలని సూచించింది.