రంజాన్ మాసంలో.. మసీదుల మూసివేత.. ఇళ్లలోనే ప్రార్థనలు..

కోవిద్-19 ధాటికి ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. సౌదీఅరేబియాలో కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో రంజాన్ మాసంలోనూ ముందుజాగ్రత్త

రంజాన్ మాసంలో.. మసీదుల మూసివేత.. ఇళ్లలోనే ప్రార్థనలు..
Follow us

| Edited By:

Updated on: Apr 21, 2020 | 3:21 PM

కోవిద్-19 ధాటికి ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. సౌదీఅరేబియాలో కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో రంజాన్ మాసంలోనూ ముందుజాగ్రత్త చర్యగా మక్కా నగరంలోని అల్ హరం. అల్ నబవీ మసీదులను మూసివేస్తూ ఆ దేశ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. రంజాన్ ఉపవాసాల సందర్భంగా ప్రపంచంవ్యాప్తంగా లక్షలాది మంది హజ్ యాత్రకు వచ్చిన భక్తులు ఈ మసీదుల్లో ప్రార్థనలు చేస్తుంటారు.

కోవిద్-19 వ్యాప్తి అరికట్టడం కోసం.. ఈ ఏడాది రెండు మసీదుల్లోనూ ప్రార్థనలు నిలిపివేయాలని నిర్ణయించామని ఈ మసీదుల ప్రెసిడెంట్ జనరల్ డాక్టర్ షేఖ్ అబ్దుల్ రహమాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌదీస్ తాజాగా ట్వీట్ చేశారు. రంజాన్ సందర్భంగా ముస్లిములు ఉపవాసాలు ఉండటంతోపాటు తరావీ నమాజులు చేస్తుంటారు. తరావీ నమాజులతో పాటు రంజాన్ ఈద్ నమాజ్ కూడా ఇళ్లలోనే చేసుకోవాలని సౌదీ అరేబియా గ్రాండ్ ముఫ్తీ షేఖ్ అబ్దుల్ అజీజ్ అల్ షేఖ్ కోరారు.

[svt-event date=”21/04/2020,3:16PM” class=”svt-cd-green” ]

[/svt-event]