పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు..
తమిళనాడును కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఫలితం లేకుండా పోతోంది. ప్రతిరోజూ ఐదు వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు 24 గంటల వ్యవధిలో అక్కడ కొత్తగా 5776 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,69,256కు చేరింది. అందులో 4,10,116 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి […]
తమిళనాడును కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఫలితం లేకుండా పోతోంది. ప్రతిరోజూ ఐదు వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు 24 గంటల వ్యవధిలో అక్కడ కొత్తగా 5776 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,69,256కు చేరింది. అందులో 4,10,116 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో 51,215 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక కరోనా మరణాలు కూడా తమిళనాడులో క్రమం తప్పకుండా నమోదవుతూనే ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో కొత్తగా 89 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,925కు చేరింది. తమిళనాడు ఆరోగ్యశాఖ ఈ వివరాలను వెల్లడించింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటూనే.. కరోనాపై ప్రచారం కూడా నిర్వహిస్తోంది. అయినప్పటికీ.. కరోనా పాజిటివ్ కేసులతోపాటు చనిపోతున్నవారి సంఖ్య కూడా పెరుగుతునే ఉంది.