AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రగిరికి, చంద్రబాబుకు లింక్.. రీపోలింగ్ రేపిన చిచ్చు.!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో నిరసన వ్యక్తం చేయనున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో రీ-పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించిన ఎన్నికల కమిషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా చంద్రబాబు ఈ నిరసన చేయనున్నారట. ఆ ప్రకారం ఎన్నికల సంఘం చీఫ్ సునీల్ అరోరాకు అధికారక పత్రాన్ని చంద్రబాబు ఇవ్వనున్నారు. రీ-పోలింగ్ కు వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న డిమాండ్ ను ఆమోదించి.. టీడీపీ చేస్తున్న డిమాండ్ ను తిరస్కరించడంలో ఎన్నికల సంఘం పక్షపాత ధోరణి చూపిస్తోందని చంద్రబాబు ఆరోపించారు.  టీడీపీ వర్గాల సమాచారం […]

చంద్రగిరికి, చంద్రబాబుకు లింక్.. రీపోలింగ్ రేపిన చిచ్చు.!
Ravi Kiran
|

Updated on: May 17, 2019 | 4:08 PM

Share

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో నిరసన వ్యక్తం చేయనున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో రీ-పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించిన ఎన్నికల కమిషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా చంద్రబాబు ఈ నిరసన చేయనున్నారట. ఆ ప్రకారం ఎన్నికల సంఘం చీఫ్ సునీల్ అరోరాకు అధికారక పత్రాన్ని చంద్రబాబు ఇవ్వనున్నారు.

రీ-పోలింగ్ కు వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న డిమాండ్ ను ఆమోదించి.. టీడీపీ చేస్తున్న డిమాండ్ ను తిరస్కరించడంలో ఎన్నికల సంఘం పక్షపాత ధోరణి చూపిస్తోందని చంద్రబాబు ఆరోపించారు.  టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం నివేదిక ఇచ్చిన తర్వాత చంద్రబాబు ఈసీ నిర్ణయంపై ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తారని తెలుస్తోంది.

ఏప్రిల్ 11న ఒక సామజిక వర్గానికి చెందిన వారు ఓటు వేయకుండా టీడీపీ అడ్డుపడిందని వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఇది ఇలా ఉంటే చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని ఈసీ బుధవారం నాడు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఐదు కేంద్రాల్లో రీ పోలింగ్ మే 19న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది.

మరోవైపు మే 6న ఏపీలోని మూడు జిల్లాల్లో ఉన్న ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ జరిగింది. ఇక 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్ సభ స్థానాలకు మొదటి విడతగా ఏప్రిల్ 11న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఆదివారం జరగనున్న రీ పోలింగ్ నేపథ్యంలో చంద్రగిరిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలింగ్ సరళిపై ప్రభావం చూపేందుకు వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి ప్రయత్నిస్తున్నాడని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నారు.

Follow Us
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?