AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రగిరికి, చంద్రబాబుకు లింక్.. రీపోలింగ్ రేపిన చిచ్చు.!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో నిరసన వ్యక్తం చేయనున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో రీ-పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించిన ఎన్నికల కమిషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా చంద్రబాబు ఈ నిరసన చేయనున్నారట. ఆ ప్రకారం ఎన్నికల సంఘం చీఫ్ సునీల్ అరోరాకు అధికారక పత్రాన్ని చంద్రబాబు ఇవ్వనున్నారు. రీ-పోలింగ్ కు వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న డిమాండ్ ను ఆమోదించి.. టీడీపీ చేస్తున్న డిమాండ్ ను తిరస్కరించడంలో ఎన్నికల సంఘం పక్షపాత ధోరణి చూపిస్తోందని చంద్రబాబు ఆరోపించారు.  టీడీపీ వర్గాల సమాచారం […]

చంద్రగిరికి, చంద్రబాబుకు లింక్.. రీపోలింగ్ రేపిన చిచ్చు.!
Ravi Kiran
|

Updated on: May 17, 2019 | 4:08 PM

Share

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో నిరసన వ్యక్తం చేయనున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో రీ-పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించిన ఎన్నికల కమిషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా చంద్రబాబు ఈ నిరసన చేయనున్నారట. ఆ ప్రకారం ఎన్నికల సంఘం చీఫ్ సునీల్ అరోరాకు అధికారక పత్రాన్ని చంద్రబాబు ఇవ్వనున్నారు.

రీ-పోలింగ్ కు వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న డిమాండ్ ను ఆమోదించి.. టీడీపీ చేస్తున్న డిమాండ్ ను తిరస్కరించడంలో ఎన్నికల సంఘం పక్షపాత ధోరణి చూపిస్తోందని చంద్రబాబు ఆరోపించారు.  టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం నివేదిక ఇచ్చిన తర్వాత చంద్రబాబు ఈసీ నిర్ణయంపై ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తారని తెలుస్తోంది.

ఏప్రిల్ 11న ఒక సామజిక వర్గానికి చెందిన వారు ఓటు వేయకుండా టీడీపీ అడ్డుపడిందని వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఇది ఇలా ఉంటే చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని ఈసీ బుధవారం నాడు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఐదు కేంద్రాల్లో రీ పోలింగ్ మే 19న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది.

మరోవైపు మే 6న ఏపీలోని మూడు జిల్లాల్లో ఉన్న ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ జరిగింది. ఇక 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్ సభ స్థానాలకు మొదటి విడతగా ఏప్రిల్ 11న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఆదివారం జరగనున్న రీ పోలింగ్ నేపథ్యంలో చంద్రగిరిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలింగ్ సరళిపై ప్రభావం చూపేందుకు వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి ప్రయత్నిస్తున్నాడని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నారు.