శారదా స్కాం: సుప్రీం యూటర్న్.. దీదీకి షాక్

పశ్చిమబెంగాల్‌లో సంచలనం సృష్టించిన శారదా చిట్‌ఫండ్ కేసులో దీదీ ప్రభుత్వానికి సుప్రీం నుంచి షాక్ ఎదురైంది. ఈ కేసులో కీలక పత్రాలు మాయం చేశారని ఆరోపణలు ఎదుర్కొటున్న కోల్‌కతా మాజీ కమిషనర్, సీనియర్ ఐపీఎస్ రాజీవ్‌కుమార్‌పై ఉన్న స్టేను ఎత్తివేస్తూ.. ఆయనను విచారించేందుకు న్యాయస్థానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా ఆయన విచారణకు సహకరించకపోతే అరెస్ట్ చేయొచ్చని కూడా సీబీఐకి సూచించింది. దీంతో రాజీవ్ కుమార్‌ను అదుపులోకి తీసుకునేందుకు సీబీఐ సన్నాహాలు చేపట్టింది. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం […]

శారదా స్కాం: సుప్రీం యూటర్న్.. దీదీకి షాక్
Follow us

| Edited By:

Updated on: May 17, 2019 | 4:40 PM

పశ్చిమబెంగాల్‌లో సంచలనం సృష్టించిన శారదా చిట్‌ఫండ్ కేసులో దీదీ ప్రభుత్వానికి సుప్రీం నుంచి షాక్ ఎదురైంది. ఈ కేసులో కీలక పత్రాలు మాయం చేశారని ఆరోపణలు ఎదుర్కొటున్న కోల్‌కతా మాజీ కమిషనర్, సీనియర్ ఐపీఎస్ రాజీవ్‌కుమార్‌పై ఉన్న స్టేను ఎత్తివేస్తూ.. ఆయనను విచారించేందుకు న్యాయస్థానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా ఆయన విచారణకు సహకరించకపోతే అరెస్ట్ చేయొచ్చని కూడా సీబీఐకి సూచించింది. దీంతో రాజీవ్ కుమార్‌ను అదుపులోకి తీసుకునేందుకు సీబీఐ సన్నాహాలు చేపట్టింది. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం రాజీవ్ కుమార్ వారంలోపు పిటిషన్ దాఖలు చేసుకోవచ్చునని సుప్రీం తెలిపింది. అయితే గతంలో ఈ కేసు విచారణకు వచ్చిన సీబీఐని మమతా సర్కార్ అడ్డుకున్న విషయం తెలిసిందే.

ఇక పశ్చిమబెంగాల్‌ ఎన్నికల విధుల్లో జోక్యం చేసుకుంటున్నారన్న కారణంతో ఈ నెల 15న రాజీవ్ కుమార్‌ను ఆ రాష్ట్ర సీఐడీ డీజీ బాధ్యతల నుంచి కేంద్ర ఎన్నికల సంఘం తప్పించింది. దీంతో ఆయన గురువారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో రిపోర్టు చేశారు. కాగా శారదా గ్రూప్ పేరుతో 200 ప్రైవేట్ కంపెనీలు నడిపిన పొంజీ స్కీం దివాళా తీయడంతో కోటి 70లక్షల మంది డిపాజిటర్లు రోడ్డునపడ్డారు.